ఐపిఎల్ 2023 లో ఈ రోజు పంజాబ్ మరియు బెంగళూరు జట్ల మధ్యన మ్యాచ్ జరుగుతోంది. ఈ రోజు రెండు మ్యాచ్ లు ఉండడంతో క్రికెట్ ప్రేమికులు చాలా సంతోషం గా ఆస్వాదిస్తున్నారు. కాగా మొదట బ్యాటింగ్ చేసిన బెంగళూర్ జట్టు నిర్ణీత ఓవర్ లలో 4 వికెట్ల నష్టానికి కేవలం 174 పరుగులకు మాత్రమే పరిమితం అయింది. కోహ్లీ మరియు డుప్లిసిస్ లు హాఫ్ సెంచరీ లతో రాణించడంతో ఆమాత్రం స్కోర్ అయినా చేశారు. మిగిలిన వాళ్ళు అంతా దారుణంగా ఫెయిల్ అయ్యారు, కాగా 175 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన పంజాబ్ జట్టు ఆరంభంలోనే తుస్సుమనిపించింది.
ఐపిఎల్ 2023: పంజాబ్ “టాప్ ఆర్డర్” ఢమాల్ … !
-