జగన్ డైవర్షన్ పాలిటిక్స్ లో భాగమే : యనమల

-

సెప్టెంబరు నాటికి విశాఖకు వెళ్లిపోతానంటూ సీఎం జగన్ ప్రకటించడంపై టీడీపీ సీనియర్ నేత, మాజీ ఆర్థికమంత్రి యనమల రామకృష్ణుడు సీఎం జగన్ పైనా, వైసీపీ ప్రభుత్వం పైనా ధ్వజమెత్తారు. విశాఖలో కాపురం పెడతాననడం జగన్ డైవర్షన్ పాలిటిక్స్ లో భాగమేనని విమర్శించారు. ఎన్నికలకు ఏడాది ముందు పోర్టులు, సదస్సుల పేరుతో హడావుడాని, యనమల ప్రశ్నించారు. విశాఖ రాజధాని మాటున రూ.40 వేల కోట్లు కొల్లగొట్టారని ఆరోపించారు.

రాష్ట్రాన్ని దోచుకుని తాడేపల్లి నేలమాళిగలు నింపుకున్నది చాల్లేదా? అని నిలదీశారు. పథకాల మాటున భారీ అవినీతికి పాల్పడ్డారని ధ్వజమెత్తారు. జగన్ అసమర్థ పాలన వల్ల ప్రభుత్వ ఖజానా ఖాళీ అయిందని విమర్శించారు. అప్పులతో రాష్ట్రాన్ని ఆర్థిక పతనం అంచున నిలబెట్టింది జగన్ కాదా? అని నిలదీశారు. రాష్ట్రానికి పెట్టుబడుల వరద అంటూ మంత్రులు ఆర్భాటపు ప్రకటనలు చేశారని, కానీ నిధులు లేక పథకాలు ఆపేశామని సీఎస్ అంటున్నారని యనమల వెల్లడించారు.

 

Read more RELATED
Recommended to you

Exit mobile version