పొలిటికల్ గాసిప్: ఆదాల ప్రభాకర్ రెడ్డి పార్టీ మారుతున్నారా ?

-

నారా లోకేష్ ఆంధ్రప్రదేశ్ అంతటా యువగళం అన్న పేరుతో పాదయాత్ర చేస్తున్న సంగతి తెలిసిందే. అబ్దులో భాగంగా ఇప్పటి వరకు పాదయాత్ర చేసిన నియోజకవర్గాలు అంటిలో అక్కడ ఉన్న స్థానిక వైసీపీ నాయకులపై ఒక రేంజ్ లో విమర్శలు చేస్తూ.. నిరాధారమైన అవినీతి ఆరోపణలు చేస్తూ వచ్చారు. కానీ ఈ మధ్యనే లోకేష్ నెల్లూరు జిల్లాలో పర్యటించిన సంగతి తెలిసిందే, సిటీ లో నెల్లూరు అనిల్ కుమార్ యాదవ్ పై చేసిన ఆరోపణలు ఇప్పటికీ హైలైట్ అవుతున్నాయి. కాగా నెల్లూరు రురల్ లో మాత్రం అక్కడ వైసీపీ ఇంచార్జి గా ఉన్న ఎంపీ ఆదాల ప్రభాకర్ రెడ్డి గురించి చిన్న మాట కూడా అనకపోవడంతో అందరిలో అనుమానం కలుగుతోంది. పైగా మాజీ ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్ర మోహన్ రెడ్డి సైతం అనుమానం కలిగేలా వ్యాఖ్యలు చేశాడు.

ఈయన మాట్లాడుతూ.. లోకేష్ ఆదాల ప్రభాకర్ రెడ్డిని విమర్శించకపోవడంపై అనుమానంగా ఉందని.. ఇప్పుడు ఆరవసారి ఆదాల పార్టీ మారుతున్నారు, త్వరలోనే కండువా మార్చడం కంఫర్మ్ అని చెబుతున్నారు. మరి ఈ గాసిప్ నిజం అవుతుందా లేదా అంది తెలియాలంటే అప్పటి వరకు ఆగాల్సిందే.

Read more RELATED
Recommended to you

Exit mobile version