నవనీత్ కౌర్ క‌న్నీరుకు కారణం ఇదేనా?

-

మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్‌ ఠాక్రే నివాసం మాతోశ్రీ వద్ద గత నెల 23న హనుమాన్‌ చాలీసా పఠిస్తామన్న వ్యాఖ్యలు దుమారం రేపాయి. ఈ వివాదస్పద ఘటనల కారణంగా ఇప్పుడు జైలు పాలు అయ్యిన సంగతి తెలిసిందే..! ఆ రోజు న‌వ‌నీత్ దంప‌తులు చేసిన వ్యాఖ్య‌ల కార‌ణంగా శాంతి భద్రతలకు భంగం కలుగుతుందన్న నెపంతో ముందస్తు చర్యగా పోలీసులు నవనీత్ కౌర్ దంపతులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అనంతరం పరీక్షలను నిర్వహించి ఇద్దరినీ వేర్వేరు జైలులో ఉంచారు.

ఈ వ్యాఖ్యల పై న్యాయ‌స్థానం ఎదుట పూర్తి వివరణ ఇచ్చిన తర్వాత వారిద్దరినీ విడుదల చేశారు. న‌వ‌నీత్ కౌర్ భ‌ర్త రవిరాణా సింగ్ విడుదలకు రెండు గంటల ముందు బైకుల్లా మహిళా జైలు నుంచి ఆయన భార్య నవనీత్‌ కౌర్‌ రాణా విడుదలయ్యారు. ఆ తర్వాత నవనీత్‌ రాణా అనారోగ్య సమస్యలతో సబ్‌ అర్బన్‌ బాంద్రాలోని లీలావతి ఆస్పత్రిలో చేరారు. రవిరాణా విడుదలైన వెంటనే నేరుగా లీలావతి ఆస్పత్రికి వెళ్లి భార్యను పరామర్శించి, ఆమె ఆరోగ్య వివరాలను అడిగి తెలుసుకున్నారు.

ఆ సమయంలో నవనీత్‌రాణా కంటతడి పెడుతండగా.. ఆమెను పట్టుకుని ఓదారుస్తూ రవిరాణా ఏడుస్తున్న వీడియో బిట్ ఒకటి సోషల్‌ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. ఆరు రోజుల నుంచి త‌న భార్య నవనీత్‌ ఆరోగ్యం బాగోలేదని, ఇదే విష‌య‌మై ఆమె .. బైకులా జైలు అధికారులకు ఫిర్యాదు చేశార‌ని, అయితే కనీసం జైలు అధికారులెవరూ ఆమె ఆరోగ్యం గురించి పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఆ వీడియో ఇప్పుడు వైరల్ కావడం తో రాజకీయ చర్చలకు దారి తీస్తోంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version