కీలక మ్యాచ్ లో ఇషాన్ కిషన్ పై వేటు … జట్టులోకి యువ సంచలనం జైస్వాల్ … !

-

ప్రస్తుతం ఇండియా మరియు వెస్ట్ ఇండీస్ జట్ల మధ్యన మూడవ మరియు కీలకమైన మ్యాచ్ జరుగుతోంది. మొదట టాస్ గెలిచిన వెస్ట్ ఇండీస్ కెప్టెన్ పావెల్ బ్యాటింగ్ ఎంచుకున్నాడు. వెస్ట్ ఇండీస్ జట్టులో ఆల్ రౌండర్ జాసన్ హోల్డర్ కు గాయం కావడంతో అతని స్థానంలో రోస్టన్ చేజ్ ను తీసుకుంది. కాగా ఇండియా టీం లో రెండు కీలకమైన మార్పులు చేసింది జట్టు యాజమాన్యం. మొదటగా కీపర్ మరియు ఓపెనింగ్ బ్యాట్స్మన్ గా ఉన్న ఇషాన్ కిషన్ కు బదులుగా యంగ్ సెన్సేషన్ యశస్వి జైస్వాల్ ను జట్టులోకో తీసుకుంది. ఇతనికి ఇదే మొదటి మ్యాచ్ కావడం గమనార్హం.. మొదటి మ్యాచ్ లో అర్ధ సెంచరీ తో రాణించిన ఇషాన్ కిషన్ , రెండవ మ్యాచ్ లో నిరాశపరిచాడు. దానితో కీలకమైన మ్యాచ్ లో అతనిపై వేటు వేసి జైస్వాల్ ను తీసుకుంది. ఇక రవి బిష్ణోయ్ కు బదులుగా, చైనామన్ కుల్దీప్ యాదవ్ ను తీసుకుంది.

మరి ఖచ్చితంగా గెలవాల్సిన ఈ మ్యాచ్ లో గెలిచి సిరీస్ ఆశలను సజీవంగా ఉంచుకుంటుందా చూడాలి.

Read more RELATED
Recommended to you

Latest news