ఈ ఏడాది రెండవ రాకెట్ ప్రయోగానికి సిధ్ధమైన ఇస్రో.. ఈరోజే !

-

ఈ ఏడాది రెండవ రాకెట్ ప్రయోగానికి ఇస్రో సిద్దమయింది. నిన్న మధ్యాహ్నం 2.41 గంటలకు పీఎస్ ఎల్వీ సీ-50 రాకెట్ ప్రయోగానికి కౌంట్‌డౌన్‌ మొదలయింది. 25 గంటల కౌంట్‌డౌన్‌ తర్వాత ఈరోజు మధ్యాహ్నం 3.41 గంటలకు నింగిలోకి నిప్పులు విరజిమ్ముతూ పీఎస్‌ఎల్‌వీ-సి50 వాహకనౌక దూసుకెళ్లనుంది. ఈ ప్రయోగం ద్వారా 1,410 కిలోల బరువు గల కమ్యూనికేషన్‌ శాటిలైట్‌ సీఎంఎస్‌-01ను నిర్ణీత కక్ష్యలో ప్రవేశ పెట్టనున్నారు మన శాస్త్రవేత్తలు.

సమాచార వ్యవస్థ కోసం అత్యాధునిక సాంకేతిక పరిజ్జానం కలిసిగిన సిఎంఎస్-01 ఉపగ్రహాన్ని అంతరిక్షంలోకి పంపుతున్నారు. ఈ శాటిలైట్ సి-బ్యాండ్ సేవల విస్థరణకు దోహదపడనుంది. ఇస్రో చరిత్రలోనే సిఎంఎస్-01 42వ సమాచార ఉపగ్రహం. 1410 కిలోల ఈ సిఎంఎస్ – 01 శాటిలైట్ జీవిత కాలం ఏడేళ్లు. ఈ ప్రయోగం విజయమంతమైతే దేశంతో పాటు అండమాన్ నికోబార్, లక్షద్వీప్ కి సమాచార వ్యవస్థ పూర్తిస్థాయిలో మెరుగు పడనుంది. 20.11 నిమిషాల్లోనే కక్ష్యలోకి ఉపగ్రహాన్ని విడిచిపెట్టేలా ఇస్రో శాస్త్రవేత్తలు ఏర్పాట్లు చేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version