ఇజ్జత్‌, మానం ఉంటే.. చేసింది చెప్పాలి : మంత్రి కేటీఆర్‌

-

ఇట్ మంత్రి కేటీఆర్ కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసారు ‘నాలుగేళ్లయింది అయ్యింది ఎంపీ అయ్యి మరి ఏం పీకనవ్‌ అని గల్లా పట్టి నిలదీసి అడగాలి. ఇజ్జత్‌, మానం ఉంటే ఏం చేసినవో చెప్పు అంటే ఏం తెల్వది. మీదికి అడ్డం పొడువు మాట్లాడుతడు. బాధ ఎందుకు అనిపిస్తుందంటే.. ‘ఇది నిన్న పేపర్‌. నేను వాలాయించి తెచ్చుకున్న. ఈ పేపర్లలో ఏం రాశారో ఎరుకేనా? టీఎస్‌పీఎస్సీ పేపర్‌ లీకేజీ కేటీఆర్‌ పనే. ఆయన రాజీనామా ఎట్ల చేయడో చూస్తా. ఇంకా దారుణం ఏంటంటే.. ముఖ్యమంత్రిని పట్టుకొని బ్రోకర్‌ అంటున్నడు. నాకు అనరాదా? నీ ప్రధానమంత్రి అదానీకి బ్రోకర్‌ అని నేను అనలేనా? మీ ప్రధాని నరేంద్ర మోదీ ఓ బ్రోకర్‌ అని అనలేనా? కానీ.. నేను అన. మాకు సంస్కారం ఉంది కాబట్టి నేను అన. దేశమంతా అంటుంటి నేను అన. మాకు చేత కాదా? మాకు మాటలు రావా? నేను సిరిసిల్లకు మెడికల్‌ కాలేజీ, ఇంజినీరింగ్‌ కాలేజీ, వ్యవసాయ కాలేజీ, పాలిటెక్నిక్‌ కాలేజీ, నర్సింగ్‌ కాలేజీ తీసుకువచ్చినా. నువ్వు తెచ్చిన బుడ్డ పాఠశాలనైనా చూపిస్తావా? మా నేతన్నలకు సిరిసిల్లలో వేలకోట్ల ఆర్డర్లు బతుకమ్మ చీరెలకు నేను. ఆర్‌వీఎం ఆర్డర్లు తెచ్చింది రాష్ట్ర ప్రభుత్వం నుంచి. మరి నువ్వు చూపిస్తావా? నేతన్నలకు చేసిన పని. నువ్వు చేసింది ఏమైనా ఉందా? ఇక్కడ అపెరల్‌ పార్క్‌ ఉన్నది. కొత్తగా కడుతున్నమ్‌ వర్కర్‌ టూ ఓనర్‌.. రూ.400కోట్లతో 1100 మందిని ఓనర్లు చేయబోతున్నామని ఆయన అన్నారు.

నిన్నే మొన్న అడ్డమైనా ఆరోపణలు చేశాడు. నేను నవ్వాలా? ఏడ్వాలా? ఆయన తెలికి. రేవేంత్‌రెడ్డి, బండి సంజయ్ ఇంకా అందరి మాటలు వింటే నాకైతే ఒకటే అనిపించింది. జీవితంలో వీరంతా ఒక్క పరీక్షనైనా రాశారో లేదో నాకైతే డౌటే. వీళ్లకు చదుకున్నడా? రేవంత్‌ డిగ్రీ ఏందో ఎవరికైనా తెలుసా? నిజామాబాద్‌ ఆయనది ఫేక్‌ డిగ్రీ. రాజస్థాన్‌లో దొంగ డిగ్రీ పెట్టి దొరికిపోయిండు. ఇక్కడ ఆయన ఇట్లున్నడు. కిషన్‌రెడ్డేమో.. ఆయన గురించి చెబితే బాగుండదు. కుర్‌కురే ప్యాకెట్లు పంచుతడు కోవిడ్‌లో. ఇజ్జత్‌ మానం ఉన్నోళ్లేనా? పురాగ ఇడిసిపెట్టినోళ్లు అనాల్నా’ అంటూ మండిపడ్డారు మంత్రి కేటీఆర్.

 

 

Read more RELATED
Recommended to you

Exit mobile version