ఏపీ అసెంబ్లీ సమావేశాలకు ముహుర్తం ఫిక్స్ అయింది. రేపటి నుంచి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు దాదాపు వారం రోజుల పాటు జరిగే అవకాశం ఉందని తెలుస్తోంది. రేపు, మధ్యాహ్నం 3 గంటలకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి అధ్యక్షతన కేబినెట్ సమావేశం జరగనుంది.

ఈ సమావేశంలో, అసెంబ్లీలో ప్రవేశపెట్టబోయే వివిధ బిల్లులకు మంత్రివర్గం ఆమోదం తెలపనుంది. కాగా, ఏపీలోని నిరుద్యోగులకు శుభవార్త. ఏపీలో ప్రభుత్వ విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టులకు APPSC నోటిఫికేషన్ చేసింది. 21 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది ఏపీపీఎస్సీ. ఆన్లైన్లో దరఖాస్తులకు అకాశం కల్పించిన APPSC… ఈ మేరకు ప్రకటన చేసింది.