జాను సినిమా చేయడం వల్లే తన పరిస్థితి ఇలా అయ్యింది: శర్వానంద్..!!

-

తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఎంతోమంది హీరోలు ఉన్నప్పటికీ ఫ్యామిలీ ఆడియన్స్ ను బాగా ఆకట్టుకున్న హీరోలలో శర్వానంద్ ఒకరని చెప్పవచ్చు.. తను నటించే పాత్రలు ఏదైనా సరే నటనకు తగ్గట్టుగా ఆ పాత్రలో పరిధి దాటకుండా నటిస్తూ ఉంటారు. ఎక్కువగా సహజంగా మనసుకు హత్తుకునే పాత్రలలో నటిస్తూ ఉంటాడు శర్వానంద్.. అయితే మహానుభావుడు సినిమా తర్వాత శర్వానంద్ కు అంతగా ఏ సినిమా కలిసి రాలేదని చెప్పవచ్చు. దీంతో ఆయన నటించిన సినిమాలు అన్ని అభిమానులను నిరాశపరిచాయి.Jaanu Movie Review: Samantha and Sharwanand's film is an earnest remake of 96 - Movies Newsఇక శర్వానంద్, సమంత జంటగా కలిసి నటించిన చిత్రం జాను. ఈ సినిమా తర్వాత శర్వానంద్ చాలా లావుగా మారిపోయారు.. ఇక ఆ తర్వాత ఈయన నటించిన సినిమాలలో.. అభిమానులు, సినీ ప్రేక్షకులు చూసి శర్వానంద్ కు బరువు తగ్గాలని కామెంట్లు కూడా చేస్తూ ఉండేవారట. శర్వానంద్ బరువు పెరగడానికి గల కారణాన్ని ఒకే ఒక జీవితం సినిమా ప్రమోషన్లలో తెలియజేయడం జరిగింది. జాను చిత్రంలో 1996 నేపథ్యంలో ఆ సినిమా కథ నడుస్తుంది.. ఒక సన్నివేశంలో తను ఫారెన్ లో స్కై డైవింగ్ చేయాల్సి ఉంటుంది.. ఇక అలా చేస్తున్నప్పుడు పారాషూట్ తో ల్యాండ్ కావలసి ఉండగా ఆ సమయంలో ఆ లాండింగ్ సరిగ్గా జరగకపోవడంతో తన భుజానికి చాలా గాయమైందట.ఇక ఆ గాయాన్ని అక్కడ వైద్యులకు చూపించగా వారు వెంటనే ఆపరేషన్ చేయాలని సూచించారట. కానీ తను హైదరాబాదుకు వెళ్లే ఆపరేషన్ చేయించుకుంటానని చెప్పడం జరిగిందట. దాంతో హైదరాబాదుకి వచ్చి ఆపరేషన్ చేయించుకున్నారట శర్వానంద్.. అలా మూడు నెలలు షూటింగ్ బంద్ కావడం చేత డాక్టర్లు ఇచ్చిన టాబ్లెట్స్ ఎక్కువగా వేసుకోవడం వల్ల తనకి తరచూ ఆకలి వేయడం వల్ల ఎక్కువగా తినేయడం వంటివి చేస్తూ ఉండడంతో బరువు పెరిగిపోయానని తెలిపారు. ఇక జాను సినిమా తన కెరీర్ ని ఒక మలుపు తిప్పిందని చెప్పారు.. ప్రస్తుతం ఒకే ఒక జీవితం సినిమా తన కెరియర్ లోనే ఒక ప్రత్యేకంగా నిలుస్తుందని తెలిపారు. ఈ సినిమా సెప్టెంబర్ 9న విడుదల కాబోతోంది.

Read more RELATED
Recommended to you

Latest news