ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసిన గురుకుల సంస్థ ఉద్యోగుల జేఏసీ

-

గురుకుల సంస్థ బదిలీలలో కేవలం రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులను మాత్రమే స్పౌజ్ కింద పరిగణిస్తున్నారని, జ్యూడిషియరీ, రైల్వే, బ్యాంకులను కూడా పరిగణలోకి తీసుకోవాలని ఆదివారం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని గురుకుల సంస్థ ఉద్యోగుల జేఏసీ కలసి వినతి పత్రం అందజేశారు.

ఈ సందర్భంగా జేఏసీ ప్రెసిడెంట్ మామిడి నారాయణ మాట్లాడుతూ.. విద్యాశాఖ బదిలీల తరహాలోనే గురుకులాలకూ అవకాశం ఇవ్వాలని కోరారు. జీవో 317 కేటాయింపులలో అన్ని స్పోజ్ కేసులను పరిగణలోకి తీసుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు. కేంద్ర ప్రభుత్వంతో పాటు పబ్లిక్ సెక్టర్లకూ కూడా అవకాశం ఇవ్వాలన్నారు. అన్ని మెడికల్ కేసులను కూడా పరిగణలోకి తీసుకొని న్యాయం చేయాలని కోరారు.ఈ కార్యక్రమంలో కే జనార్ధన్, డాక్టర్ మధుసూదన్,నరసింహులు గౌడ్, గణేష్ తదితరులు ఉన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news