అమరావతి కి జగన్ ఇవ్వనున్న ప్యాకేజీ ఇదే .. నిరసన అనేదే ఉండకుండా సూపర్ స్కెచ్..!!

-

ఎప్పుడైతే ఏపీ సీఎం వైఎస్ జగన్ వికేంద్రీకరణ అనే అంశాన్ని తెరపైకి తీసుకు రావడం జరిగిందో అమరావతి ప్రాంతంలో ఉన్న రైతులు మరియు తెలుగుదేశం పార్టీ నేతలు చంద్రబాబు కుటుంబ సభ్యులు ఆందోళనలు నిరసనలు గత నెల రోజుల నుండి చేస్తూనే ఉన్నారు. అమరావతి రాజధాని తరలింపు కార్యక్రమం వైయస్ జగన్ చేపట్టారని తెలుగుదేశం పార్టీ నేతలు గత కొంత కాలం నుండి అమరావతి ప్రాంతంలో ఆందోళనలు నిరసనలు చేస్తున్నా దగ్గర మీడియా సమావేశాలలో రెచ్చగొట్టే విధంగా మాట్లాడుతూ వస్తున్నారు.

ఇటువంటి తరుణంలో ఇటీవల హైపవర్ కమిటీతో భేటీ అయిన వైసీపీ పార్టీ మంత్రులు కమిటీ సూచనల మేరకు అమరావతి ప్రాంత రైతులకు సీఎం జగన్ గత ప్రభుత్వం చంద్రబాబు ప్రభుత్వం కంటే భారీ ప్యాకేజీ ఇవ్వడానికి రెడీ అయినట్లే ఈ దెబ్బతో అమరావతి ప్రాంతంలో నిరసన అనేదే లేకుండా జగన్ సరికొత్త నిర్ణయం తీసుకోబోతున్నట్లు మంత్రి బొత్స సత్యనారాయణ హై పవర్ కమిటీ భేటీ తో మీటింగ్ అయిన తర్వాత మీడియాతో మాట్లాడటం జరిగింది.

 

క్లియర్ కట్ గా మేటర్ లోకి వెళితే వైయస్ జగన్ అమరావతి ప్రాంతంలో కట్టాల్సిన బిల్డింగులు మొత్తం కట్టి ఫ్లాట్ ల రూపంలో రైతులకు చంద్రబాబు ఇచ్చిన ప్యాకేజీ అంటే గట్టిగానే ఇచ్చే ఆలోచన చేస్తున్నట్లు సమాచారం. 

Read more RELATED
Recommended to you

Exit mobile version