గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులకు శుభవార్త చెప్పిన జగన్ సర్కార్

-

ఆంధ్రప్రదేశ్ లోని గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులకు శుభవార్త చెప్పింది జగన్ ప్రభుత్వం. ప్రొబేషన్ డిక్లరేషన్ పై సీఎం జగన్ తాజాగా సంతకం చేశారు. ఈ అంశంపై ఒకటి లేదా రెండు రోజుల్లో జీవో విడుదల కానుంది. జూలై 1 నుంచి గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులకు కొత్త పే స్కేల్ విధానం అమలు కానుంది. ఆగస్టు 1న కొత్త జీతాలు అందుకోనున్నారు.

గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులకు కొత్త పే స్కేల్ ప్రకారమే జీతాలు ఇవ్వాలని సీఎం వైఎస్ జగన్ స్పష్టమైన ఆదేశాలు ఇవ్వడంతో అధికారులు ఆ దిశగా చర్యలు ప్రారంభించారు. ప్రొబేషన్ డిక్లరేషన్ కోసం కొంత కాలంగా ఉద్యోగులు ఎదురుచూస్తున్నారు. తాజాగా ఏపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం పై గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version