కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి వ్యవహారంపై జగన్ సీరియస్ !

-

నెల్లూరు రూరల్‌ వైసీపీ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి సంచలన ఆరోపణలు చేశారు. తనపై ఇంటెలిజెన్స్ అధికారులు నిఘా పెట్టారన్న నెల్లూరు రూరల్‌ వైసీపీ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి.. నా ఫోన్ 3 నెలల నుంచి ట్రాప్ చేస్తున్నారని ఆగ్రహించారు. ఫోన్ ట్రాప్ చేస్తున్న విషయం నాకు ముందు నుంచి తెలుసు, రహస్యాలు మాట్లాడుకునేందుకు వేరే ఫోన్ ఉందని వెల్లడించారు.

నాకు 12 సిమ్‌లు ఉన్నాయన్నారు కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి. ఫేస్ టైమర్, టెలిగ్రాం కాల్స్‌ని మీ పెగాసస్ రికార్డు చేయలేదని పేర్కొన్నారు. అయితే, వైసీపీ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి చేసిన ఈ సంచలన ఆరోపణలపై జగన్‌ సీరియస్‌ అయ్యారట. కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి వ్యవహారం పై పార్టీ అధిష్టానం దృష్టి సారించినట్లు సమాచారం అందుతోంది. మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి…జిల్లా పార్టీ అధ్యక్షుడు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డిలతో ఫోన్ లో సీనియర్ నేతలు చర్చలు జరుపుతున్నారు. జిల్లాలో జరుగుతున్న పరిణామాలపై ఆరా తీస్తున్నారు. ఏ క్షణమైన కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డిపై వేటు వేసేందుకు వైసీపీ సిద్ధమైనట్లు సమాచారం.

Read more RELATED
Recommended to you

Latest news