తిరుమలలో జగన్ షెడ్యూల్ ఇదే !

-

సీఎం జగన్ తిరుమల పర్యటన ఖరారు అయింది. 23 సాయంత్రం 3.50 గంటలకు రేణిగుంట ఎయిర్ పోర్ట్ కి చేరుకోనున్న జగన్, రోడ్ మార్గం ద్వారా 5 గంటలకు పద్మావతి గెస్ట్ హౌస్ కు చేరుకోనున్నారు. ఆరోజునే ఒక గంట విశ్రాంతి తీసుకుని సాయంత్రం 6.30 నిమిషాలకు శ్రీవారికి పట్టు వస్త్రాలు సమర్పించనున్నారు.

ఇక 24 ఉదయం శ్రీవారిని దర్శించుకుంటారు జగన్, ఆ తరువాత శ్రీవారి దర్శనాంతరం 7 గంటలకు ఆలయం వెలుపల వున్న నాదనీరాజన మండపం వద్ద జరగనున్న సుందరకాండ కార్యక్రమంలో కర్ణాటక సీఎం యడ్యూరప్పతో కలిసి జగన్ పాల్గొననున్నారు. అలానే 8.10 కి కర్ణాటక సీఎం యడ్యూరప్ప తో కలిసి కర్ణాటక సత్రాల భవన నిర్మాణానికి భూమి పూజ కార్యక్రమంలో సీఎం జగన్ పాల్గొననున్నారు. ఇక 10 గంటలకు తిరుమల నుంచి రేణిగుంట విమానాశ్రయానికి బయలుదేరనున్న జగన్ అక్కడి నుండి గన్నవరం విమానాశ్రయం చేరుకుంటారు. అక్కడి నుండి ఆయన రోడ్డు మార్గంలో తాడేపల్లిలోని తన నివాసానికి చేరుకుంటారు.

Read more RELATED
Recommended to you

Latest news