నారా లోకేష్ రెడ్ బుక్ లో మొదటి పేరు జగన్ దే ఉంది :బొజ్జల సుధీర్ రెడ్డి

-

అసెంబ్లీ జరుగుతుంటే జగన్ ఢిల్లీ పారిపోయాడు అని తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి ఎద్దేవ చేశారు. అమరావతిలోని అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద మాట్లాడుతూ..ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం 33 మందిని చంపింది అని మాపై తప్పుడు ప్రచారం చేస్తున్నారు అని వైసిపి పై మండిపడ్డారు.జగన్ కి దమ్ముంటే 33మంది లిస్ట్ బయటపెట్టాలి అని ఆయన సవాల్ విసిరారు.మదనపల్లి లో ఫైల్స్ తగలపెట్టిన ఎవరిని వదిలిపెట్టం అని వార్నింగ్ ఇచ్చారు .ఫైల్స్ తగలపెట్టిన ఘటన లో పెద్దిరెడ్డి ఉన్నా శిక్షిస్తాం అని తేల్చి చెప్పారు.నారా లోకేష్ రెడ్ బుక్ లో మొదటి పేరు జగన్ దే ఉంది అని ఆయన అన్నారు.

కాగా, ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు ఫాలో అయ్యే వారికి చాలా సుపరిచితం ఈ బుక్. ప్రతిపక్షంలో ఉన్నామని వేధించిన పోలీసుల,అక్రమ కేసులు పెట్టిన పోలీసుల పేర్లు, తెలుగుదేశం పార్టీ నేతలను హింసిస్తున్న నేతలు, వారి అనుచరులు.. ఇలా ప్రతి ఒక్కరి పేరును రెడ్ నారా లోకేష్‌ బుక్‌లో ఎంటర్ చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news