BJP వైపు మాజీ ఎమ్మెల్యే జైపాల్ యాదవ్..?

-

కల్వకుర్తి మాజీ ఎమ్మెల్యే గుర్కా జైపాల్ యాదవ్ బీఆర్ఎస్ పార్టీని విడిచిపెట్టి బిజెపిలో చేరబోతున్నారా..? ఇప్పటికే కేంద్రమంత్రి కిషన్ రెడ్డి అలానే మాజీ మంత్రి ఈటల రాజేందర్ ద్వారా చర్చలు జరిగినట్లు కల్వకుర్తి నియోజకవర్గం బీఆర్ఎస్ నాయకుల్లో మూడు రోజుల నుండి కూడా ప్రచారం జోరుగా సాగుతోంది. బీసీ సామాజిక వర్గానికి చెందిన బలమైన నేత జైపాల్ యాదవ్ మూడుసార్లు ఎమ్మెల్యేగా గెలిచారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో తెలంగాణ తెలుగుదేశం హయాంలో రెండు సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు.

తెలంగాణ స్వరాష్ట్రంలో బిఆర్ఎస్ ఎమ్మెల్యేగా కూడా ఎన్నికయ్యారు. జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోవడంతో ఇప్పుడు బిజెపిలోకి రావాలని ఆహ్వానించినట్లు తెలుస్తోంది కేంద్రమంత్రి కిషన్ రెడ్డి మాజీ మంత్రి ఈటల రాజేందర్ బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే జైపాల్ యాదవ్ ని బిజెపి లోకి ఇన్వైట్ చేశారు. నరేంద్ర మోడీ పర్యటన ఉంది కనుక శనివారం చేరవచ్చు అని అందరూ అంటున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news