ఎంపీ భరత్.. పార్టీని సర్వనాశనం చేశాడు : వైసీపీ ఎమ్మెల్యే సంచలనం

-

రాజమండ్రి : రాజానగరం వై.సి.పి ఎమ్మెల్యే జక్కంపూడి రాజా సంచలన వ్యాఖ్యలు చేశారు. రాజమండ్రిలో వై. సి. పి పార్టీని ఎం.పి భరత్  సర్వనాశనం చేస్తున్నారని .. టి. డి. పి ఎమ్మెల్యే గోరంట్లతో కలిసి ఎం.పి భరత్ కుమ్మక్కు రాజకీయాలు చేస్తున్నారని సంచలన ఆరోపణలు చేశారు. సి.ఎం జగన్ ను ఇబ్బంది పెట్టిన జెడీ లక్ష్మీనారాయణతో కలిసి ఎం.పి భరత్ సెల్ఫీలు తీసుకుంటారా ? అని నిలదీశారు.

రౌడీషీటర్లు, భూకబ్జాదార్లు ఎం.పి భరత్ వెనుక ఉన్నారని.. ఎం.పి భరత్ వి చీప్ చేష్టలు, పిచ్చిపిచ్చి చేష్టలు చేస్తున్నారని నిప్పులు చెరిగారు. ఎం.పి భరత్ తీరు మార్చుకోవాలని హెచ్చరించారు. రాజానగరం నియోజకవర్గంలో నా వెంట్రుక కూడా పీకలేరని స్పష్టం చేశారు. తన పై చెయ్యాల్సిన వ్యాఖ్యలు చేసేసి.. చివరిగా ఎం.పి భరత్ తూచ్ అంటున్నారని మండిపడ్డారు.   ఇక నైనా ఎం.పి భరత్ తన వైఖరిని మార్చు కోవాలని.. లేకపోతే కటినంగా వ్యవహరించాల్సి ఉంటుందని జక్కంపూడి రాజా హెచ్చంరించారు.

Read more RELATED
Recommended to you

Latest news