టీడీపీ, జనసేన భారీ బహిరంగ సభ.. గెలుపే లక్ష్యంగా..!

-

బై బై వైసిపి లక్ష్యంగా టీడీపీ జనసేన కూటమి కార్యాచరణ ప్రణాళికని మొదలుపెట్టింది ఈ ప్రణాళికలో భాగంగా 28వ తేదీన తాడేపల్లిగూడెంలో భారీ బహిరంగ సభని నిర్వహించడానికి రెండు పార్టీలు కూడా రెడీ అయ్యాయి. సార్వత్రిక ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా తెలుగుదేశం జనసేన ప్రణాళిక రూపొందిస్తుంది. ఈ సభలో చంద్రబాబు పవన్ కళ్యాణ్ ఒకే వేదిక పంచుకోబోతున్నారు కీలక నిర్ణయాలను తీసుకుబోతున్నారు.

ఉమ్మడి కార్యాచరణ పై తెలుగుదేశం జనసేన సమన్వయ కమిటీలో చర్చించి పలు తీర్మానాలకి ఆమోదాన్ని తెలిపారు. తెలుగు దేశం పార్టీని ఎన్డీఏలోకి ఆహ్వానించిన నేపథ్యంలో త్వరలో ఆ విషయంపై స్పష్టత వస్తుందని అచ్చెన్నాయుడు అన్నారు ఈ బహిరంగ సభలో చంద్రబాబు పవన్ కళ్యాణ్ పాల్గొని పార్టీ శ్రేణుల్ని దిశా నిర్దేశం చేయబోతున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version