ఆర్యన్‌, జాన్వీ కపూర్ ప్రేమకి బ్రేకులు పడ్డాయా ?

-

కార్తీక్ ఆర్యన్ బాలీవుడ్‌ ప్లేబాయ్‌లా మారిపోతున్నాడు. సినిమాల్లో గెటప్పులు మార్చినంత ఈజీగా లవ్‌ స్టోరీస్‌ మార్చేస్తున్నాడు. ఇప్పటికే ఒక హీరోయిన్‌కి బ్రేకప్ చెప్పిన కార్తీక్ ఆర్యన్, లేటెస్ట్‌గా శ్రీదేవి కూతురుకి కూడా కటీఫ్‌ చెప్పాడనే ప్రచారం జరుగుతోంది.

కార్తీక్ ఆర్యన్, జాన్వీ కపూర్‌ రిలేషన్‌లో ఉన్నారని చాలా రోజులుగా ప్రచారం జరుగుతోంది. ‘దోస్తానా-2’ షూటింగ్‌లో ఇద్దరూ క్లోజ్ అయ్యారని, పార్టీలు..డిన్నర్లు అంటూ కలిసి తిరుగుతున్నారనే టాక్ కూడా ఉంది. ఇద్దరూ కలిసి గోవాలో న్యూ ఇయర్‌ సెలబ్రేషన్స్‌ కూడా చేసుకున్నారు. అయితే ఇప్పుడు వీళ్లిద్దరు విడిపోయారనే ప్రచారం జరుగుతోంది.

కార్తీక్ ఆర్యన్, జాన్వీ కపూర్‌ ఎప్పుడూ రిలేషన్‌షిప్‌ గురించి గానీ, విడిపోయామని గానీ చెప్పలేదు. అయితే వీళ్లిద్దరి కెమిస్ట్రీతో డేటింగ్‌ వ్యవహారం బయటకు వచ్చింది. అలాగే ఇప్పుడు సోషల్‌ మీడియా యాక్టివిటీతో వీళ్లిద్దరు విడిపోయారనే టాక్ వస్తోంది. ఇన్నాళ్లు ఇన్‌స్టాగ్రామ్‌లో కలిసున్న వీళ్లు ఇప్పుడు ఒకరినొకరు అన్‌ఫాలో అవుతున్నారు. దీంతో జాన్వీ, కార్తీక్‌ విడిపోయారనే ప్రచారం మొదలైంది.

కార్తీక్ ఆర్యన్ ఇంతకుముందు సైఫ్ అలీఖాన్ కూతురు సారా అలీఖాన్‌తో రిలేషన్‌లో ఉన్నాడనే ప్రచారం జరిగింది. అయితే జాన్వీ పరిచయమయ్యాక సారాకి బ్రేకప్‌ చెప్పాడనే టాక్ వచ్చింది. ఇప్పుడేమో జాన్వీకి కూడా కటీఫ్‌ చెప్పాడు. దీంతో కార్తీక్ ఆర్యన్ మరో రణ్‌బీర్‌ కపూర్‌లా మారుతున్నాడనే మాటలు వినిపిస్తున్నాయి.

Read more RELATED
Recommended to you

Exit mobile version