ఈ నెల 31న తెలంగాణకు జేపీ నడ్డా

-

బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా తెలంగాణ పర్యటించనున్నారు. పర్యటనలో భాగంగా ఆయన ఈనెల‌ 31న సంగారెడ్డిలో తెలంగాణ బీజేపీ ముఖ్యనేతలతో కీలక సమావేశం నిర్వహిస్తారు. ఈ ఏడాదే తెలంగాణ అసెంబ్లీకి ఎన్నికలు జరగనుండటంతో ఆయన తెలంగాణ పర్యటనకు ప్రాధాన్యత ఏర్పడింది. తెలంగాణలో ప్రస్తుతం రాజకీయాలు వేడెక్కాయి. భారత్ రాష్ట్ర సమితికి, బీజేపీకి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటోంది. రెండు పార్టీల మధ్య ఎన్నడూ లేనంత దారుణంగా సంబంధాలు దెబ్బతిన్నాయి.

బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కె.కవిత ఢిల్లీ మద్యం కుంభోణంలో ఈడీ విచారణ ఎదుర్కొంటుండటంతో తెలంగాణలో రెండు పార్టీల మధ్య ఘర్షణలు పతాకస్థాయికి చేరుకున్నాయి. దీనికి తోడు టీఎస్‌పీఎస్‌సీ పేపర్ లీక్ కేసులో బీజేపీ దూకుడుగా వ్యవహరిస్తూ బీఆర్ఎస్‌ను ఇరుకునపెడుతోంది. ఈ తరుణంలో నడ్డా తెలంగాణ పర్యటనపై విస్తృత చర్చ జరుగుతోంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version