తెలుగుదేశం పార్టీకి జూనియర్ ఎన్టీఆర్ మాత్రమే వారసుడు – ఎన్టీఆర్ ఫ్యాన్స్

-

గత నాలుగు రోజులుగా జూనియర్ ఎన్టీఆర్ మీద చేస్తున్న అసభ్యకర ట్రోల్స్ ను ఖండిస్తున్నామని అన్నారు ఎన్టీఆర్ కృష్ణ జిల్లా అభిమాన సంఘం నాయకులు కావూరి కృష్ణ, నున్న గణేష్. ఈ సందర్భంగా వారు ఓ ప్రకటన విడుదల చేశారు. ” గత 4 రోజులుగా జూనియర్ ఎన్టీఆర్ గారి మీద చేస్తున్న అసభ్యకర ట్రోల్స్ ను ఖండిస్తున్నాము.

అక్రమంగా నడుపుతున్న తెలుగుదేశం పార్టీ వారికి తెలియజేయడం ఏమనగా మీరు కావాలి అనుకున్నప్పుడు జూనియర్ ఎన్టీఆర్ రావాలి. వద్దు అంటే సైలెంట్ గా ఉండాలా.. తెలుగుదేశం పార్టీకి జూనియర్ ఎన్టీఆర్ మాత్రమే వారసుడు. మీరు ప్రస్తుతానికి అక్రమంగా నడుపుకుంటున్నారు, నడుపుకోండి అంతేగాని జూనియర్ గురించి ఒక్క మాట మాట్లాడిన, ఒక్క ట్రోల్ వేసినా ఊరుకోము.

మీ చరిత్ర మీరు ఆ మహా నాయకుడు ఎన్టీఆర్ గారి మీద ఎలాంటి కుట్రలు చేశారో తెలియాలని నిన్నటి నుండి ఎన్టీఆర్ జిల్లాలో ప్రతి కాంపౌండ్ గోడకు ఎన్టీఆర్ గారి గురించి నీచంగా మాట్లాడిన చంద్రబాబు న్యూస్ పేపర్లు అంటిస్తున్నాము. ఇందులో ఏ పార్టీకి సంబంధం లేదు. కేవలం జూనియర్ ఎన్టీఆర్ అభిమానుల బాధాతప్త హృదయంతోనే చంద్రబాబు నాయుడు నీచ చరిత్ర ప్రజలకు తెలియాలనే ఉద్దేశంతోనే చేస్తున్నాము”. అని ప్రకటన విడుదల చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news