నీతి నిజాయితీ కు నిలువుటద్దం కైకాల సత్యనారాయణ.!

-

కైకాల మృతితో తెలుగు చిత్ర పరిశ్రమలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది.పలువురు సినీ ప్రముఖులు అయన మృతి పట్ల సంతాపం వ్యక్తం చేస్తున్నారు. ఇటీవలే దిగ్గజాలు కృష్ణంరాజు, కృష్ణ మరణంతో మొదటి తరాన్ని తెలుగు చిత్ర పరిశ్రమ కోల్పోయింది. వారికి సరి జోడీగా ఎక్కడా తగ్గకుండా నటించిన కైకాల సత్యనారాయణ మరణం వెల కట్టలేనిది.

సినీ, రాజకీయ ప్రముఖులు ఆయన మృతిపట్ల సంతాపం వ్యక్తం చేస్తున్నారు. తెలంగాణ ముఖ్య మంత్రి స్వయంగా పార్ధీవ దేహం కు నివాళి అర్పించారు.అంతే కాకుండా ప్రభుత్వ లాంఛనాలు తో  కార్యక్రమం జరిపించాలని అదేశాలు ఇచ్చారు.తాజాగా నటుడు, నిర్మాత, ఆంద్రప్రదేశ్ FDC చైర్మన్ పోసాని కృష్ణమురళి మాట్లడుతూ కైకాల సత్యనారాయణ అరుదైన మనస్తత్వం గురించి చెప్పుకొచ్చారు.

కైకాల సత్యనారాయణ వంటి వారు మనకు  సినీ పరిశ్రమ లో  వెతికినా కనిపించరు, ఆయన చివరి వరకు నీతి నిజాయితీ తో బతికారని , అవకాశం కోసం కాళ్లు పట్టుకునే ప్రయత్నం అస్సలు ఇష్టపడరని , సినీ కళాకారుడు ఉన్నంతకాలం బతికే మహానుభావుడు కైకాల సత్యనారాయణ.. జోహార్” అని తెలిపారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ గా మారింది. నిజంగా అప్పటి జనరేషన్ వాళ్లే కాకుండా ఇప్పటి జనరేషన్ వాళ్ళు కూడా ఆయనను గుర్తుకు తెచ్చుకొని కన్నీళ్లు పెట్టుకుంటున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version