సాగు చ‌ట్టాల ర‌ద్దుపై కంగ‌నా సంచ‌ల‌న వ్యాఖ్య‌లు..!

-

సాగుచ‌ట్టాల ర‌ద్దుపై ప‌లువురు రాజ‌కీయనాయ‌కులు సెల‌బ్రెటీలు స్పందిస్తున్నారు. ఇక కొంత‌మంది సాగుచ‌ట్టాల‌ను ర‌ద్దు చేయ‌డం పై పాజిటివ్ గా స్పందిస్తుండ‌గా మ‌రికొంద‌రు మాత్రం నెగిటివ్ గా స్పందిస్తున్నారు. తాజాగా వివాదాస్ప‌ద న‌టి కంగ‌నార‌నౌత్ సాగు చ‌ట్టాల ర‌ద్దుపై వివాదాస్ప‌ద వ్యాఖ్య‌లు చేశారు. వీధిపోరాటాల శ‌క్తి చాలా గొప్ప‌దని మ‌రోసారి నిరూపిత‌మైందంటూ ఓ నెటిజ‌న్ పోస్ట్ పెట్టారు. కాగా ఆ పోస్ట్ ను షేర్ చేసిన కంగ‌నా ర‌నౌత్ వివాదాస్ప‌ద వ్యాఖ్య‌లు చేసింది.

పార్లమెంట్ కు ఎన్నుకున్న ప్రభుత్వం కాకుండా వీధుల్లోని వ్యక్తులు చట్టాలను చేయడం మొదలు పెడితే.. అది అక్షరాలా జిహాదీ దేశమే అవుతుంది…..ఇలాంటివి కావాలనుకుంటున్న వారందరికీ శుభాకాంక్షలు. అంటూ కంగ‌నా పేర్కొంది. అంతే కాకుండా నేడు ఇందిరా గాంధీ పుట్టిన రోజు కావ‌డంతో ఆమెకు శుభాకాంక్ష‌లు తెలుపుతూ…..దేశ ఆత్మసాక్షి గాఢమైన నిద్రలో ఉన్నప్పుడు లాఠీలు ప్రయోగించడం…నియంతృత్వాన్ని అమల్లోకి తేవడమే సరైన పరిష్కారం.. హ్యాపీ బర్త్ డే మేడమ్ ప్రైమ్ మినిస్టర్ అంటూ మరో పోస్ట్ పెట్టింది.

Read more RELATED
Recommended to you

Latest news