అంబానీ వేడుక పై కంగనా పోస్ట్.. ఎంత డబ్బులిచ్చినా అలా చెయ్యనంటూ..!

-

ప్రముఖ వ్యాపారవేత్త ముకేశ్ అంబానీ కొడుకు అనంత్ రాధికా ప్రీ వెడ్డింగ్ వేడుకలు ఘనంగా జరిగిన విషయం తెలిసిందే. మూడు రోజులు పాటు నిర్వహించిన ఈ వేడుకలు ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన ఈవెంట్ గా నిలిచింది. బాలీవుడ్ స్టార్లతో పాటుగా పలువురు సినీ ప్రముఖులు కూడా హాజరయ్యారు. ఈ వేడుకలో డాన్స్ పెర్ఫార్మెన్స్ వంటివి చేసి కోట్లు లో డబ్బులు సంపాదించుకున్నారు. ఇందులో సల్మాన్ ఖాన్ అమీర్ ఖాన్ షారుక్ ఖాన్ అంటే స్టార్స్ పాల్గొనడం చర్చనీయాంశంగా మారింది.

స్టార్ హీరోయిన్ కంగానా బాలీవుడ్ స్టార్స్ ని ఉద్దేశించి సంచలన పోస్ట్ చేసింది దివంగత సింగర్ లతా మంగేష్కర్ గతంలో చేసిన వ్యాఖ్యలను షేర్ చేశారు. నేను లతా మంగేష్కర్ ఒకేలా ఆలోచిస్తామన్నారు. నేను చాలా ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొన్నాను కానీ కొన్ని నిర్ణయాలని ఎప్పుడు మార్చుకోలేదు. పెళ్లిలో అవార్డులు ఫంక్షన్లో పర్ఫామెన్స్ ఇవ్వడానికి చాలా ఆఫర్లు వచ్చాయి కానీ ఒప్పుకోలేదని అన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news