సుశాంత్ మరణం తర్వాత కనపడకుండా పోయిన కరణ్

-

కరణ్ జోహార్… బాలీవుడ్ యువ హీరో సుశాంత్ సింగ్ రాజపుత్ మరణం తర్వాత ఎక్కువగా విమర్శలు వచ్చింది ఈయనపైనే. ఆయన మీద బీహార్ లో కేసు కూడా నమోదు చేసారు. సుశాంత్ మరణించిన నాటి నుంచి ఎక్కడ ఉన్నారో అర్ధం కావడం లేదు. ఆయన డిప్రెషన్ లో ఉన్నాడు అని ఇటీవల కొందరు వ్యాఖ్యలు చేసారు. కాని ఆయన మాత్రం ఇప్పటి వరకు మీడియాలో కనపడలేదు.

సోషల్ మీడియాలో కూడా ఆయన పెద్దగా హడావుడి చేయడం లేదు. ఆయన ఎక్కడికో వెళ్ళిపోయాడు అంటూ పలువురు కామెంట్ చేస్తున్నారు. ఆయన మీద కేసు నమోదు కావడంతో ఇప్పుడు భయపడుతున్నారు అని మరికొందరు అంటున్నారు. కొన్ని రోజులుగా అసలు బయటికి కూడా రాకుండా ఇంట్లోనే ఉంటున్నాడని అంటున్నారు. ప్రముఖులు ఎవరు అయినా ఇంటికి వెళ్ళినా సరే ఆయన అసలు మాట్లాడటం లేదు అని కూడా అంటున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news