ఇక‌పై ఏడ‌వ‌ను…క‌ర్నాట‌క సీఎం కామెంట్స్..!

-

క‌ర్నాట‌క మాజీ ముఖ్య‌మంత్రి కుమార‌స్వామి గ‌తంలో అనేక‌సార్లు మీడియా స‌మావేశాల్లో క‌న్నీళ్లు పెట్టుకున్న సంగ‌తి తెలిసిందే. అయితే ఇక పై తాను ఏడ‌వ‌ను అంటూ ఆయ‌న ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. మాజీ సీఎం క‌న్నీరు పెట్ట‌డంపై ఎన్నో విమ‌ర్శ‌లు వ‌చ్చాయి..ప్ర‌తీసారి ఈ క‌న్నీళ్లు ఎంటని ఏడ‌వ‌టం ఆపేయాల‌ని నెటిజ‌న్లు కామెంట్లు చేశారు. దాంతో తాజాగా ఆయ‌న ఇక‌పై క‌న్నీరు పెట్టుకోన‌ని….కన్నీరు పెట్టుకోను అన్నంత మాత్రాన ఘ‌ట‌న‌ల‌కు స్పందించ‌కుండా గుండె రాయి చేసుకుంటాన‌ని అర్థం కాద‌న్నారు.

kumaraswami
kumaraswami

అంతే కాకుండా విధాన‌ప‌రిష‌త్ ఎన్నిక‌ల్లో తాను ఏ పార్టీకి మ‌ద్ద‌తు ఇస్తాన‌నేది ఈ రోజు ప్ర‌క‌టిస్తాన‌ని చెప్పారు. బీజేపీ తాను మ‌ద్ద‌తు ఇస్తున్న‌ట్టు ఎక్క‌డా చెప్ప‌లేద‌ని ఆయ‌న స్ప‌ష్టం చేశారు. ముందు కాంగ్రెస్ త‌మ పార్టీ గురించి ఆలోచించాల‌ని…జేడీఎస్ కుటుంబ రాజ‌కీయాల గురించి మాట్లాడే ముందు త‌మ పార్టీ గురించి ఆలోచించాలి అంటూ చుర‌క‌లు అంటించారు.తండ్రీ కొడుకులు ఇద్ద‌రూ ఒకే సారి శాస‌న‌స‌భ‌లో ఉన్న విష‌యం మ‌ర్చిపోయారా అంటూ కాంగ్రెస్ నాయ‌కులను ప్ర‌శ్నించారు.

Read more RELATED
Recommended to you

Latest news