వెనక్కి తగ్గేదే లే.. భజరంగ్ దళ్ నిషేధంపై కాంగ్రెస్

-

కన్నడనాట రాజకీయం రోజురోజుకు వేడి రాజుకుంటోంది. ఇప్పటికే ప్రధాన పార్టీలు పోటాపోటీగా ప్రచారం నిర్వహిస్తున్నారు. తాజాగా కాంగ్రెస్ లేవనెత్తిన ఓ అంశం కర్ణాటక రాజకీయాల్లో పెనుదుమారం రేపింది. బజరంగ్ దల్ ను నిషేదిస్తామని కాంగ్రెస్ తమ మేనిఫెస్టో లో పొందు పరిచిన నిర్ణయంతో బీజేపీ, కాంగ్రెస్ ల మధ్య పెనుగులాట జరుగుతోంది.

తాజాగా ఈ అంశంపై కర్ణాటక పీసీసీ అధ్యక్షుడు డీకే శివకుమార్ మాట్లాడారు. భజరంగ్  దల్ నిషేదం అంశాన్ని ఎన్నికల మానిఫెస్టో నుంచి తొలగించే పసక్తేలేదని డీకే శివకుమార్ స్పష్టం చేశారు. బీజేపీ ఏం చేసినా తమ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోమని తేల్చి చెప్పారు. గురువారం బెంగళూరులోని ఓ హోటల్ ఏర్పాటు చేసిన సమావేశం అనంతరం.. కర్ణాటక పీసీసీ అధ్యక్షుడు ఈ వ్యాఖ్యలు చేశారు. బజరంగ్ దళ్కు, ఆంజనేయ స్వామికి సంబంధం ఏంటని ఆయన ప్రశ్నించారు. తాను కూడా రాముడు, ఆంజనేయ స్వామి, శివుడికి భక్తుడేనంటూ వివరించారు. రోజు హనుమాన్ చాలీసా పఠిస్తానని శివకుమార్ తెలిపారు.

“బీజేపీ వారు మాత్రమే భక్తులు కాదు. మేమూ భక్తులమే. బజరంగ్ దళ్ను బ్యాన్ చేస్తే బీజేపీకి ఎందుకంత భయం? బజరంగ్ దళ్ విషయంలో బీజేపీ రెచ్చగొట్టే పనులు చేస్తోంది. కర్ణాటక ప్రజలు దీనిని క్రమంగా అర్థం చేసుకుంటారు. ఆంజనేయ స్వామి, బజరంగ్ దళ్.. రెండూ వేర్వేరు. మేం ఇచ్చిన హామీలకు కట్టుబడి ఉన్నాం.”

– డీ.కే శివకుమార్, కర్ణాటక కాంగ్రెస్ అధ్యక్షుడు.

Read more RELATED
Recommended to you

Exit mobile version