ముంబై బయల్దేరిన కంగనా.. ఎస్కార్ట్ గా కర్ణి సేన !

-

శివసేనతో మాటల యుద్ధం నడుస్తోన్న వేళ వివాదాస్పద నటి కంగనా ముంబైకి బయలుదేరింది. అయితే శివసేన హెచ్చరికల నేపధ్యంలో రాజ్‌పుట్ కర్ణి సేన సభ్యులు ముంబయి విమానాశ్రయం నుంచి ఆమె నివాసం దాకా ఆమెకు ఎస్కార్ట్ గా ఉంటామని ప్రకటించారు. మణికర్ణిక నటి కంగనాకు భద్రత కల్పించే బాధ్యత తమ మీద ఉందని కర్ణి సేనకు చెందిన జీవన్ సోలంకి చెప్పారు.

ముంబై నగరాన్ని ‘పాకిస్తాన్ ఆక్రమిత-కాశ్మీర్’ మరియు ‘తాలిబాన్’లతో పోల్చడంతో ఆమెను ముంబైకి తిరిగి రావద్దని శివసేన నేతలు హెచ్చరించారు. ఇక కంగనా రనౌత్‌కు మద్దతుగా ముంబై విమానాశ్రయానికి కర్ణి సేన హాజరుకానుంది. కర్ణి సేన సభ్యులు కంగనా రనౌత్ ను విమానాశ్రయం నుండి తన ఇంటికి వెళ్ళే దాకా ఎస్కార్ట్ గా ఉంటారు. విమానాశ్రయంలో ఇప్పటికే కర్ణి సేన సభ్యుల బృందం ఉంది, వారు తమ సొంత భద్రతతో కంగనను తన ఇంటి దాకా తీసుకువెళతారని తెలుస్తోంది. ముంబైలో ఉన్నంత సేపు కంగనా రనౌత్ భద్రతపై కర్ణి సేన బాధ్యత తీసుకుంటోందని సోలంకి చెబుతున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news