బిగ్ బాస్ ఎపిసోడ్ 3: ఎవరిని ఎలా బుక్ చేయాలో.. అలా బుక్ చేసిన బిగ్ బాస్!

-

మొదటి రోజు ఏడుపులు పెడబొబ్బలతో మొదలైన భారతదేశపు మోస్ట్ సక్సెస్ఫుల్ రియాలిటీ షో బిగ్ బాస్ సీజన్ – 4 తెలుగు లో రెండో రోజు మాత్రం బిగ్ బాస్ కంటెస్టెంట్ లో మనస్తత్వాలు తగ్గట్టు వారిని ఒక ఆట ఆడించాడు అనే చెప్పాలి. దొరికిన చోటల్లా ఎమోషనల్ అయిపోదాం అని మోనాల్ లాచూసేవారు.. ఇక ఎక్కడ అవకాశం దొరికితే అక్కడ మనుషులు మీదకి ఎక్కి రచ్చ చేద్దామని కరాటే కళ్యాణిలా ప్రయత్నించేవారు.. ఇక పాపం తెలిసి తెలియక చేసిన పనులతో అభిజిత్ లా ఇరుక్కొని పోయేవారు.. ఇక ఏది ఏమైనా తన పని తాను చేసుకుపోయే గంగవ్వ లాంటివారు ఉన్న హౌస్ లో వీళ్ళందరి మధ్య ఫిట్టింగ్ లు పెట్టేందుకు బిగ్ బాస్ రెడీ అయిపోయారు.

రెండో రోజు ప్రారంభమైన ఎపిసోడ్ లో… కరాటే కళ్యాణి టీచర్ లాగా మారి హౌస్ మేట్స్ అందరికీ పాఠాలు చెప్పింది. బిగ్ బాస్ ఆమెకు ఇంటి నియమాలను అందరికీ పాఠాల రూపంలో వివరించే టాస్క్ ఇచ్చారు. అయితే గంగవ్వ కళ్యాణి ని ఒక ఆట ఆడుకుంది. తను యాభై ఏళ్ల నుంచి ఇదే స్కూల్లో ఉంటున్నానని చెప్పిన గంగవ్వ తన స్టైల్లో కళ్యాణి కి గాలి తీసేసింది. “జీతం జీతమే తీసుకుంటున్నావు…. ఇట్లనే అందర్నీ ఫెయిల్ చేస్తున్నావ్…. పిచ్చాసుపత్రిలో చేర్చాలి నిన్ను” అని ఆమెకు కౌంటర్లు వేసింది. ఇక సీక్రెట్ రూమ్ లోని సోహైల్, అరియానా తమకు ఫుడ్ కావాలి అని బిగ్ బాస్ హౌస్ కి ఫోన్ చేశారు. అరియానా చేసినా ఫోన్ లిఫ్ట్ చేసిన అఖిల్ రకరకాలుగా వారిని కన్విన్స్ చేసేందుకు ప్రయత్నించారు. మీకు ఫుడ్ లేకుండా మాడ్చారు కదా…. వెళ్లి హౌస్ లో వారిని నిలదీయండి అన్నట్టు వారిని హౌస్ లోనికి పంపించారు.

ఇక బ్డ్జెట్ టాస్క్ లో భాగంగా రాజశేఖర్ మాస్టర్ న్యాయ నిర్ణేత గా వ్యవహరించగా దేవీ సంచాలకురాలిగా వ్యవహరించింది. మొత్తం 12 మందిని ఆరు గ్రూపులుగా విడదీయగా…. టాస్క్ లో భాగంగా ‘చిత్రం ఎవరిది’ అని ఒక అసైన్మెంట్ ఇచ్చారు. ప్రస్తుతానికి 14 వేలకు గాను ఐదువేల రూపాయలు వచ్చాయి. మిగతా పాయింట్లను తర్వాత ఎపిసోడ్స్ లో కంటెస్టెంట్స్ సాధించుకోవాల్సి వస్తుంది. అయితే మొత్తానికి ఈ రోజు మాత్రం కరాటే కళ్యాణికి మంచి స్టఫ్ దొరికింది అని చెప్పాలి.

అభిజిత్ కళ్యాణి దగ్గరికి వెళ్లి, “మీరు గంగవ్వ లా శారీ కట్టుకోకండి మేం చూడలేక చస్తాము’ అని అన్నారు. అంతే ఆమె ఇదే అవకాశం అని “నేను మరీ అంత చచ్చిపోయేలా ఉండను…. నాకు ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. మీరు హీరో అయితే అయి ఉండొచ్చు కానీ నేను అంత అందంగా ఉండను అని మీరు ఆ మాట అనకూడదు. నేణు ఫీల్ అయ్యాను” అని చెప్పిన కళ్యాణి…. నీ మనసులో నా గురించి ఏదో నడుస్తూనే ఉంది.. మీరు నన్ను గమనిస్తూ ఉన్నారు” అంటూ అభిజిత్ ని హౌస్ అంతా రచ్చ రచ్చ చేసింది.

“నేను సరదాగా అన్నాను” అని అతను ఎంత మొత్తుకున్నా వినలేదు. చాలాసేపు ఈ రచ్చను నడిపింది. ఇక అతను హౌస్ లో కనపడినప్పుడల్లా క్లాస్ పీకుతూనే ఉంది. చివరిగా మొత్తానికి ఇంట్లో కట్టప్ప ఎవరో ఇంకా ఒక కొలిక్కి రాలేదు. కట్టప్ప ఎవరు అనుకుంటున్నారు అని బిగ్ బాస్ పెట్టిన బ్యాలెట్ లో లాస్య, అఖిల్ సార్దక్, సూర్యకిరణ్ పేర్లను ఎక్కువ మంది రాశారు. ఇక మొత్తంమీద చివరకు ఒక యాక్షన్ సన్నివేశంతో ఆగిపోయిన బిగ్ బాస్ 2వ ఎపిసోడ్ మంచి ఎమోషన్స్ ని పెంచింది. సీక్రెట్ రూమ్ లో నుంచి వచ్చి బిగ్ బాస్ హౌస్ లోకి అరియానా, సోహైల్ అడుగుపెట్టారు. వాళ్ళు వచ్చీ రావడంతోనే ఫుడ్ విషయంలో గొడవకు దిగినట్లు తెలుస్తోంది. మరి రేపు ఏం జరుగుతుందో చూద్దాం……

Read more RELATED
Recommended to you

Latest news