కార్తీకదీపం ఎపిసోడ్ 1156: అమ్మమ్మతాతయ్య అంటూ ఏంట్రీ ఇచ్చిన ఇద్దరు మనవళ్లు..ఇంతకీ ఎవరో వాళ్లు

-

కార్తీకదీపం ఈరోజు ఎపిసోడ్ లో దీప..కార్తీక్ గురించి మంచిమాటలు చెప్పి పిల్లలను నిలదీస్తుంది. కార్తీక్ హిమను పట్టుకుని బంగారం నేనేం తప్పు చేయలేదురా, మీరు ఏడిస్తే మీ నాన్న తట్టుకోలేడురా..నాకు కూడా ఏడుపొస్తుంది అని పిల్లలు ఇద్దరిని దగ్గరకు తీసుకుంటాడు.

మరుసటిరోజు ఉదయం మోనిత..నా బిడ్డకు తండ్రి అతనే..ఒ డాక్టర్ వింతప్రేమ కథ అని వార్త పేపర్ లో చూసి కార్తీక్ కు చమటలుపడతాయ్..దీప వచ్చి పేపర్ ని అలా చూస్తున్నారేంటి, ఏమైంది అని అడుగుతుంది. కార్తీక్ పేపర్ దీపకు ఇస్తాడు. పేపర్ చూసి దీప కూడా టెన్షన్ తో మిన్నకుంటుంది. ఇంతలో శౌర్య..నా డ్రస్ కనిపించటం లేదు అని వస్తుంది. దీప పేపర్ దాచిపెట్టినా..శౌర్య లాక్కోని చదవుతుంది. ఏడుస్తూ..నాన్న ఇది నిజమా అంటుంది. కార్తీక్ నో అని గట్టిగా అరుస్తాడు. కట్ చేస్తే కార్తీక్ కల ఇది అంతా..శౌర్య రావటం సీన్ లో లేదు. పేపర్ కిందేస్తాడు. సౌందర్య వచ్చి ఏంట్రా పేపర్ కిందేశావ్ అని వార్తను చూసి..అనుకుంటూనే ఉన్నా ఈ విషనాగు ఏదో ఒకరోజు కాటేస్తుంది అని ..పిల్లలకు భయపడతారు అందరు. సౌందర్య బయటవాళ్ల సంగతి తరువాత చూసుకుందాం..ముందు ఈ పేపర్ ని దాచేమని సౌందర్య, కార్తీక్ అంటారు.

ఇటువైపు జైల్లో ఉన్న మోనిత కూడా పేపర్ ని చూసి దీపకు ఈ పాటికి గిఫ్ట్ చేరే ఉంటుంది అనుకుని..గోడలపై ఉన్న కార్తీక్ పేర్లతో..నిన్ను అర్జెంటుగా చూడలానిపిస్తుంది. జైల్లో ఉన్నా సరే నిన్ను చూడాలనుకుంటే చూడాల్సిందే. నన్ను నీ దగ్గరికి నా ప్రేమే చేరుస్తుంది. ఈ విషయంలో సోడా సుకన్య హెల్ప్ తీసుకుంటా..నిన్ను కళ్లారా తీసుకుంటా అనుకుంటుంది.

ఇంట్లో ఉన్న దీప..ఆ పేపర్ ని అనుబాంబులాగా పట్టుకుని రూంలోకి తీసుకొచ్చి డోర్ లాక్ చేసుకుని చదువుతుంది. కార్తీక్ తో ఉన్న మధురజ్ఞాపకాలను తలుచుకుని బాధపడుతుంది. వార్తను చదువుతుంది. ఇటు మోనిత కూడా వార్తను చదువుతంది. దీప ఏడ్చుకుంటూ చదివితే..మోనిత నవ్వుకుంటూ చదువుతుంది. ఈ సీన్ ఒకేసారి చూపిస్తారు. బాగా లాగ్ చేస్తారు ఈ సీన్. పాపం దీప ఆ వార్తను చదివి బాగా ఏడుస్తుంది. ఇంతలో శౌర్య తలుపుతీయ్ మని డోర్ కొడుతుంది.. దీప కంగారుగా ఆ పేపర్ ని బెడ్ కింద పెడుతుంది. ఏం చేస్తున్నావ్ ఏం చేస్తున్నావ్ అని శౌర్య పదే పదే అడుగుతుంది. ఏం లేదని దీప చెబుతుంది. రెడీ ఐ పూజ దగ్గరకు రమ్మని నానమ్మ చెబుతుంది అని శౌర్య అంటుంది. కట్ చేస్తే పూజ స్టాట్ వస్తుంది. పూజను ఆనందంగా చేస్తారు. ఇంతలో ఇద్దరు పిల్లలు వచ్చి హాయ్ అమ్మమ్మ, హాయ్ తాతయ్య అంటారు. హిమ, శౌర్యలకు వాళ్లెవరో అర్థంకాదు. సౌందర్య, ఆనంద్ రావులు ప్రేమగా రండిరా అంటారు. ఆ ఇద్దరిని దగ్గరకు తీసుకుంటారు. అలా ఈరోజు ఎపిసోడ్ ముగుస్తుంది.

Read more RELATED
Recommended to you

Latest news