నేడు భువనగిరిలో కేసీఆర్ రోడ్ షో

-

లోక్ సభ ఎన్నికల ప్రచారంలో స్పీడు పెంచిన బీఆర్ఎస్ బాస్, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ వరుస పర్యటలు, సమావేశాలతో దూసుకెళ్తున్నారు. బుధవారం రోజున బస్సు యాత్ర ప్రారంభించి ప్రచారాన్ని మరింత హోరెత్తించారు.  ఎన్నికల ప్రచారంలో భాగంగా కేసీఆర్‌ ‘పోరుబాట బస్సుయాత్ర’ను నల్గొండ జిల్లా మిర్యాలగూడ నుంచి బుధవారం షురూ చేశారు. ఇక ఇవాళ ఈ యాత్ర భువనగరికి చేరుకోనుంది.

ప్రచారం అనంతరం సూర్యాపేటలోనే బస చేసిన కేసీఆర్ ఈరోజు భువనగిరిలో రోడ్ షో నిర్వహించనున్నారు. అనంతరం సాయంత్రం ఎర్రవెల్లిలోని తన ఫామ్ హౌస్ కు చేరుకుని విశ్రాంతి తీసుకోనున్నారు. ఇక రేపు మహబూబ్ నగర్ లో కేసీఆర్ రోడ్ షో సాగనుంది. సాయంత్రం 6 గంటలకు మహబూబ్ నగర్ లో కేసీఆర్ ప్రచారం వుంటుంది.  రాత్రికి అక్కడే బస చేయనున్నారు.

ఈ యాత్రలో భాగంగా కేసీఆర్ కాంగ్రెస్, బీజేపీలపై తీవ్రంగా ఫైర్ అవుతున్నారు. ముఖ్యంగా సీఎం రేవంత్ రెడ్డి తనపై చేస్తున్న విమర్శలకు దీటుగా బదులిస్తున్నారు. కేసీఆర్‌ జైళ్లకు భయపడబోడని.. తెలంగాణ ప్రజల కోసం ఏం చేసేందుకైనా సిద్ధమని చెబుతున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news