నేడు వరంగల్‌లో కేసీఆర్‌ బస్సుయాత్ర.. షెడ్యూల్ ఇదే

-

పార్లమెంట్ ఎన్నికల్లో 10 ఎంపీ సీట్లు దక్కించుకోవడమే లక్ష్యంగా గులాబీ బాస్ కేసీఆర్ ప్రచారాన్ని హోరెత్తిస్తున్నారు. వరుసగా బస్సు యాత్రలు చేస్తూ ప్రజల్లో, కార్యకర్తల్లో ఉత్సాహాన్ని నింపుతున్నారు. బీఆర్ఎస్కు మరోసారి ఛాన్స్ ఇస్తే.. పార్లమెంట్లో తెలంగాణ గళం వినిపిస్తామంటూ ఓటర్లను అభ్యర్థిస్తున్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా కేసీఆర్ ఈరోజు వరంగల్లో పర్యటించనున్నారు. వరంగల్‌ నుంచి తొర్రూరు, మరిపెడ మీదుగా కేసీఆర్‌ బస్సు యాత్ర సాగనుంది. తొర్రూరు, మరిపెడ మీదుగా ఈ యాత్ర ఖమ్మం చేరుకోనుంది.

కేసీఆర్ పర్యటనకు బీఆర్ఎస్ శ్రేణులు అన్ని ఏర్పాట్లు చేశాయి. గులాబీ బాస్ బస్సు యాత్రకు పెద్ద ఎత్తున జనం తరలివస్తున్నారు. కేసీఆర్ యాత్ర రాత్రి వరకు సాగుతున్నా జనం సమావేశం ముగిసేవరకు ఉంటున్నారు. మరోవైపు ఆదివారం రోజున కేసీఆర్ హనుమకొండలో పర్యటించిన విషయం తెలిసిందే. అసెంబ్లీ ఎన్నికల తరువాత తొలిసారి ఓరుగల్లుకు వచ్చిన గులాబీ దళపతికి పార్టీ శ్రేణులు ఘనస్వాగతం పలికాయి. కాంగ్రెస్ అడ్డగోలు హామీలిచ్చి ప్రజలను వంచించిందని ఆరోపించిన కేసీఆర్ నాలుగు నెలల్లోనే రాష్ట్రాన్ని దివాళా తీయించారని ధ్వజమెత్తారు.

Read more RELATED
Recommended to you

Latest news