గులాబీ పార్టీకి బిగ్ రిలీఫ్ దక్కింది. తెలంగాణ మొట్టమొదటి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. గత రెండు రోజులుగా ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్న కేసీఆర్… ఆరోగ్యం మెరుగుపడింది. సీజనల్ వ్యాధితో బాధపడ్డ కేసీఆర్ యశోద ఆసుపత్రిలో రెండు రోజుల కిందట అడ్మిట్ అయ్యారు.

అనంతరం.. వైద్యుల సమక్షంలోనే రెండు రోజులపాటు చికిత్స పొందారు కేసీఆర్. ఇక ఆయన ఆరోగ్యం మెరుగుపడడంతో ఇవాళ.. డిశ్చార్జ్ అయ్యారు కెసిఆర్. కెసిఆర్ వెంట హరీష్ రావు అలాగే సంతోష్ కూడా ఉన్నారు. ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ నేరుగా ఎర్రవెల్లికి కేసీఆర్ వెళ్తున్నట్టు తెలుస్తోంది.