రాష్ట్రంలో 60 ఏళ్లలో ఉన్న దరిద్రాన్ని కేసీఆర్‌ పదేళ్లలోనే తొలగించారు : సంజయ్‌ కల్వకుంట్ల

-

బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ఫోన్‌ ట్యాప్‌ చేసి ఉంటే గత ఏడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో రాష్ట్రవ్యాప్తంగా బీఆర్‌ఎస్‌ అన్ని స్థానాల్లోనూ గెలిచి ఉండేదని కోరుట్ల ఎమ్మెల్యే డాక్టర్‌ సంజయ్‌ కల్వకుంట్ల తెలిపారు. కోరుట్లలో 5 సార్లు పోటీ చేసి ఓడిపోయిన కాంగ్రెస్‌ నాయకుడు నర్సింగరావు ఏదో పెద్ద నాయకుడిని అనుకొని మాట్లాడుతున్నారని మండిపడ్డారు .కరీంనగర్‌లోని ఎమ్మెల్యే గంగుల కమలాకర్‌ నివాసంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ..కాంగ్రెస్‌ గాలి వీచిన 2009 ఎన్నికల్లోనూ నర్సింగరావు 17 వేల ఓట్లతో ఓడిపోయారని ,తర్వాత జరిగిన ఎన్నికల్లో 70 వేల ఓట్లతో, 2014లో 22 వేల ఓట్లతో, 2018లో 32 వేల ఓట్ల తేడాతో ఓడిపోయారని ఆయన గుర్తు చేశారు. 2023 ఎన్నికల్లో కనీసం డిపాజిట్‌ కూడా రాలేదని విమర్శించారు.

రాష్ట్రంలో 60 ఏళ్లలో ఉన్న దరిద్రాన్ని కేసీఆర్‌ పదేళ్లలోనే తొలగించారని, ఇప్పుడు కాంగ్రెస్‌ ప్రభుత్వం ఆ దరిద్రాన్ని మళ్లీ తీసుకొచ్చిందని తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. ఆరు నెలల్లోనే స్కాంలు ,అవినీతి పెరిగిపోయిందని, ప్రజాధనాన్ని దోచుకుంటున్నారని అన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news