టైమ్ పాస్ కోసం కేసీఆర్ ఢిల్లీకి పోతుండు : బండి సంజయ్

-

తెలంగాణలో మరి కొన్ని రోజుల్లో పార్లమెంట్ ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో బీజేపీ ఎన్నికల శంఖారావం పూరించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ లో బీజేపీ విజయ సంకల్ప సభలో సంజయ్ పాల్గొన్నారు.రేపు టైమ్ పాస్ కోసం కేసీఆర్ ఢిల్లీకి వెళ్తున్నారని విమర్శలు గుప్పించాడు.గత 10 సంవత్సరాల పాలనలో బీఆర్ఎస్, కేసీఆర్ వల్ల పేద ప్రజలకు ఏమైనా న్యాయం జరిగిందా? అని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రానికి మోదీ ప్రభుత్వం డబ్బులు ఇస్తుంటే.. ఓట్లు మాత్రం బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలకు వేస్తున్నారని మండిపడ్డారు.

మొదట బీఆర్ఎస్ పార్టీకి అధికారం ఇస్తే, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి అధికారం ఇచ్చారని అన్నారు. ప్రభుత్వం ఎవరు ఏర్పాటు5 చేసిన పేద ప్రజలకు న్యాయం జరగడంలేదన్నారు బండి సంజయ్. ఆచరణకు సాధ్యం కానీ హామీలు ఇచ్చి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందని అన్నారు. ఇప్పుడు హామీల గురించి అడిగితే ఆ పార్టీ నేతలు తప్పించుకు తిరుగుతున్నారని ఆరోపించారు . వచ్చే లోక్ సభ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థులను భారీ మెజారిటీతో గెలిపించాలని బండి సంజయ్ కోరారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version