BREAKING : ఆంధ్రజ్యోతికి షాకిచ్చిన కేసీఆర్.. ప్రకటనలు నిలిపివేత !

-

ఏడేళ్ల క్రితం బీజం పడిన ఆలోచన ఎట్టకేలకు ఆవిష్కృతమైంది. ప్రపంచంలోనే అత్యంత ఎత్తయిన భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ స్మారకం ఆవిష్కరణకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. హుస్సేన్‌సాగర్‌ తీరంలో ఈ భారీ విగ్రహాన్ని ఇవాళ మధ్యాహ్నం సీఎం కేసీఆర్‌ అట్టహాసంగా ఆవిష్కరించనున్నారు.

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బీఆర్‌ అంబేడ్కర్‌ మనవడు ప్రకాశ్‌ అంబేడ్కర్‌ హాజరుకానున్నారు. అయితే.. ఈ నేపథ్యంలోనే.. ఆంధ్రజ్యోతికి షాకిచ్చింది కేసీఆర్ సర్కార్‌.
తప్పుడు వార్తలు రాస్తున్న పత్రికలపై కొరడా ఝులిపించింది తెలంగాణ సర్కార్. ఇటీవల తరచూ ఫేక్ వార్తలు ప్రచురిస్తున్న ఆంధ్రజ్యోతి, డెక్కన్ క్రానికల్ పత్రికలకు ఇవ్వాళ అంబేడ్కర్ జయంతి ప్రకటనల నిలిపివేసింది కేసీఆర్‌ సర్కార్‌. ఇక దీనిపై తెలంగాణ ప్రజా సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి.

Read more RELATED
Recommended to you

Exit mobile version