కెసిఆర్ త్వరగా కోలుకోవాలి – గవర్నర్ తమిళిసై

-

తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర రావు ఈరోజు మధ్యాహ్నం స్వల్ప అస్వస్థతకు గురయ్యారు. దీంతో ఆయనను ప్రగతి భవన్ నుంచి గచ్చిబౌలిలోని ఏఐజి ఆసుపత్రికి తరలించారు. కెసిఆర్ వెంట ఆయన కుమార్తె ఎమ్మెల్సీ కవిత కూడా ఆసుపత్రికి వెళ్లారు. ఈ క్రమంలో గచ్చిబౌలిలోని ఏఐజి ఆసుపత్రిలో వైద్య పరీక్షలు నిర్వహించారు. అయితే సీఎం కేసీఆర్ కి పొత్తికడుపులో అసౌకర్యంగా ఉండడంతో కుటుంబ సభ్యులు ఆసుపత్రికి తీసుకువచ్చారని తెలుస్తోంది.

ఏఐజి ఆసుపత్రి చైర్మన్ నాగేశ్వర్ రెడ్డి నేతృత్వంలో వైద్య పరీక్షలు నిర్వహించారు. అల్సర్ ఉన్నట్లు గుర్తించిన డాక్టర్స్ ప్రాథమికంగా కొన్ని మందులు రిఫర్ చేసినట్లు తెలుస్తోంది. అయితే ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సీఎం కేసీఆర్ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు గవర్నర్ తమిళిసై. సీఎం కెసిఆర్ త్వరగా కోలుకోవాలని.. ఆయన పూర్తి ఆరోగ్యంగా ఉండాలని ఆమె ట్వీట్ చేశారు. గత కొంతకాలంగా ప్రభుత్వం – గవర్నర్ మధ్య వివాదాలు తారాస్థాయికి చేరిన నేపథ్యంలో తమిళిసై చేసిన ఈ ట్వీట్ ప్రాధాన్యం సంతరించుకుంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version