Kerala: రూ.75 లక్షల లాటరీ గెలిచాడు.. భయంతో వణికాడు

-

లాటరీలో రూ.75 లక్షలు గెలుచుకున్నా కేరళలోని ఓ వలస కార్మికుడు ఆ లాటరీ టికెట్‌ను ఎవరైనా తీసుకుంటారనే భయంతో పోలీస్‌ స్టేషన్‌ను ఆశ్రయించాడు. అయితే ఆ లాటరీ టికెట్‌ను బ్యాంకులో డిపాజిట్‌ చేసేందుకు అతడు పోలీస్‌ రక్షణ కోరాడు. ఆ కార్మికుడి భయాన్ని పోలీసులు అర్థం చేసుకోని సానుకూలంగా స్పందించారు. వెస్ట్ బెంగాల్‌కు చెందిన వలస కార్మికుడు అశోక్‌ కొన్ని నెలల క్రితం కేరళకి వచ్చాడు.

ఇతర కార్మికులతో కలిసి మలప్పురం జిల్లాలోని పెరింతల్మన్న ప్రాంతంలోని ఒక ఇంట్లో నివసిస్తున్నాడు. కొన్ని నెలల కిందట కేరళ ప్రభుత్వానికి చెందిన విన్-విన్ లాటరీ టికెట్‌ కొనుగోలు చేయగా …అందులో మొదటి బహుమతిగా రూ.75 లక్షలు అతడు గెలుచుకున్నాడు. గెలిచిన లాటరీ టికెట్‌ను బ్యాంకులో సమర్పించేందుకు సీనియర్ సీపీఓతో సహా పోలీసు సిబ్బందిని అశోక్‌ వెంట పోలీసులు పంపారు. ఆ తర్వాత లాటరీ టికెట్‌ గెలిచిన ఆనందాన్ని అనుభవించి , ఆ తర్వాత వెస్ట్ బెంగాల్‌లోని తన స్వగ్రామానికి తిరిగి వెళ్లాలని అశోక్ నిర్ణయించుకున్నాడు.

Read more RELATED
Recommended to you

Latest news