Rohit Sharma : రోహిత్ శ‌ర్మ‌కు అవ‌మానం..! ముంబై ఇండియ‌న్స్ పై మండిప‌డుతున్న ఫ్యాన్స్‌..

-

Rohit Sharma – Mumbai Indians : ఇటీవ‌ల రోహిత్ శ‌ర్మ‌ను కెప్టెన్సీ బాధ్య‌త‌ల నుంచి త‌ప్పించి విమ‌ర్శ‌లు ఎదుర్కొన్న ముంబై ఇండియ‌న్స్ పై తాజాగా మ‌రోసారి ప్రేక్షకులు మండిప‌డుతున్నారు. అస‌లు ముంబై జ‌ట్టులో ఏం జ‌రుగుతుందోన‌ని అనే ఆందోళ‌న‌ను వ్య‌క్తం చేస్తున్నారు.జ‌న‌వ‌రి 25 నుంచి ఇండియా జ‌ట్టు ఇంగ్లాండ్‌తో ఐదు మ్యాచుల టెస్టు సిరీస్ ఆడ‌నుంది. ఈ నేప‌థ్యంలో బీసీసీఐ శుక్ర‌వారం మొదటిరెండు టెస్టుల్లో పాల్గొనే ఇండియా జ‌ట్టును ఎంపిక చేసింది.

కెప్టెన్‌గా రోహిత్ శ‌ర్మ‌నే కొన‌సాగ‌నుండ‌గా సీనియ‌ర్ ఆట‌గాళ్లు అజింక్యా ర‌హానే ,పుజారకు మొండిచేయి ఎదురైంది. వైస్ కెప్టెన్‌గా జ‌స్‌ప్రీత్ బుమ్రాను నియ‌మించింది.కాగా.. దీనిపై ముంబై ఇండియ‌న్స్ ఓ పోస్ట‌ర్‌ను క్రియేట్ చేసి రిలీజ్ చేయడంతో కొత్త వివాదం ప్రారంభమైంది. ముంబై రిలీజ్ చేసిన పోస్ట‌ర్‌లో కేఎల్ రాహుల్,బుమ్రా, శ్రేయ‌స్ అయ్య‌ర్‌ ల చిత్రాలు ఉన్నాయి. కెప్టెన్ అయిన రోహిత్ శ‌ర్మ చిత్రం లేదు. దీంతో అభిమానులు మండిపడుతున్నారు. ఇది ముమ్మాటికీ రోహిత్ శ‌ర్మ‌ను అవ‌మానించ‌డమే అని అంటున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news