ఖ‌మ్మం ఎంపీగా పోటీ చేస్తా : వి హ‌నుమంత‌రావు

-

మరికొన్ని నెలల్లో దేశవ్యాప్తంగా పార్లమెంట్ ఎన్నికలు జరగనున్నాయి.ఈ నేపథ్యంలో రాజకీయ పార్టీలు కసరత్తులను ప్రారంభించాయి. ఇందులో భాగంగా రాజకీయ పార్టీలు సార్వత్రిక ఎన్నికలలో పోటీ చేసే అభ్యర్థుల యొక్క పేర్లను ప్రకటి ంచేందుకు సన్నాహాలు చేస్తున్నారు.ఆయా ఎంపీ నియోజ‌క‌వ‌ర్గాల్లో టికెట్ ద‌క్కించుకునేందుకు చాలా మంది నాయ‌కులు తీవ్రంగా ప్ర‌య‌త్నిస్తున్నారు. మ‌హ‌బూబ్‌న‌గ‌ర్ పార్లమెంట్ స్థానం నుంచి వంశీచంద్ రెడ్డి పోటీ చేస్తార‌ని ముఖ్యమంత్రి రేవంత్ ఇటీవ‌లే ప్ర‌క‌టించారు. ఈ నేపథ్యంలో సీనియ‌ర్ నాయ‌కులు వి హ‌నుమంత‌రావు కీల‌క వ్యాఖ్య‌లు చేశారు.

ఖ‌మ్మం లోక్ సభ స్థానం నుంచి పోటీ చేసి తీరుతాను అని వీహెచ్ తేల్చిచెప్పారు. ఖ‌మ్మంలో చాలా సంవ‌త్స‌రాల నుంచి అక్కడ జ‌రిగిన ప్ర‌తి అన్యాయంపై పోరాడాను. ఖ‌మ్మం నుంచి పోటీ చేయాల‌ని అక్క‌డి ప్ర‌జ‌లు కోరుతున్నారు అని అన్నారు. కాంగ్రెస్ కోసం త‌న కంటే ఎక్కువ క‌ష్ట‌ప‌డ్డ వాళ్లు ఉన్నారా..? అని ప్రశ్నించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై త‌న‌కు న‌మ్మ‌కం ఉంది అభిప్రాయం వ్యక్తం చేశారు. కొత్త‌వాళ్లు టికెట్లు అడిగితే త‌న లాంటి సీనియ‌ర్ల ప‌రిస్థితి ఏంటీ..? అని, గ‌త ఎన్నిక‌ల్లో కూడా త‌న‌కు అన్యాయం జ‌రిగింద‌ని ఆయన ఆవేద‌న వ్య‌క్తం చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news