డబ్బు కోసం అలా చేయడం నాకిష్టం లేదు: కియారా అద్వానీ … !

-

బాలీవుడ్ హీరోయిన్ కియారా అద్వానీ మహేష్ బాబు నటించిన భరత్ అనే నేను సినిమా ద్వారా టాలీవుడ్ లోకి అడుగు పెట్టింది. మొదటి సినిమాతోనే సక్సెస్ ను అందుకున్న ఈ అందాల బొమ్మ ఆ తరువాత రామ్ చరణ్ తో తీసిన “వినయవిధేయరామ” తో బొక్క బోర్లా పడింది. ఆ తర్వాత టాలీవుడ్ లో పలు అవకాశాలు వచ్చినా చేసే సాహసం చేయలేదు. ఇక లేటెస్ట్ గా తమిళ స్టార్ డైరెక్టర్ శంకర్ తో రామ్ చరణ్ హీరోగా “గేమ్ చేంజర్” సినిమా చేస్తోంది. ఈ సందర్భంగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న కియారా… కెరీర్ గురించి ఒక కీలకమైన విషయాన్ని వెళ్ళడించింది. ఈ ఇంటర్వ్యూ లో యాంకర్ అడిగిన ఒక ప్రశ్నకు నాకు కథ నచ్చితే చాలు ఎలాంటి పాత్రలో అయిన నటించడానికి నాకు అభ్యంతరం లేదని చెప్పారు కియారా.

అంతే కానీ కథ బాగా లేకుండా రెమ్యూనరేషన్ ఎంత ఇచ్చినా నేను చేయడానికి సిద్ధంగా లేనని తేల్చి చెప్పేసింది. అలా చేయడం వలన నా కెరీర్ నాశనం అవుతుందన్నారు… డబ్బు కోసం నేను అలాంటి పనులు చేయలేనన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news