IPL 2021 : దుమ్ములేపిన కేకేఆర్… పంజాబ్ టార్గెట్ 166

-

ఐపీఎల్ 2021 రెండో సీజన్..లో భాగంగా ఇవాళ కోల్‌ కత్తా నైట్‌ రైడర్స్‌ మరియు పంజాబ్‌ కింగ్స్ జట్ల మధ్య 45 వ మ్యాచ్‌ జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్ దుబాయి లోని ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో జరగుతోంది. అయితే ఈ ఇందులో టాస్ ఓడి బ్యాటింగ్‌ కు దిగిన కోల్‌ కత్తా నైట్‌ రైడర్స్‌ జట్టు భారీ స్కోర్‌ నే రాబట్టింది. 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి ఏకంగా 165 పరుగులు చేసింది.

ఇక కోల్‌ కత్తా నైట్‌ రైడర్స్‌ బ్యాట్స్‌ మెన్స్‌ లలో వెంకటేష్‌ అయ్యర్‌ ఏకంగా 67 పరుగులు చేసి జట్టును ఆదుకున్నాడు. అలాగే… మిడిలార్డర్‌ బ్యాట్స్‌ మెన్స్‌… రాహుల్‌ త్రిపాఠి 34 పరుగులు, అలాగే… నితీష్‌ రాణా 31 పరుగులు చేసి.. పర్వాలేదని పిచ్చారు. ఇక పంజాబ్‌ బౌలర్లలో అర్ష్‌దీప్‌ సింగ్‌ 3 వికెట్లు తీసి.. కేకేఆర్‌ ఆటగాళ్ల కు చుక్కలు చూపించగా… రవి బిష్ణోయ్‌ 2 వికెట్లు తీశాడు. ఇక పంజాబ్‌ కింగ్స్‌ ఈ మ్యాచ్‌ లో గెలవాలంటే 20 ఓవర్లలో 166 పరుగులు చేయాల్సి ఉంది. మరి కాసేపట్లోనే పంజాబ్‌ ఇన్నింగ్స్‌ ప్రారంభం కానుంది.

Read more RELATED
Recommended to you

Latest news