పవన్ కళ్యాణ్ హత్యకు కుట్ర..రంగంలోకి కేంద్రం !

-

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ హత్యకు కొంత మంది కుట్ర చేసిన సంగతి తెలిసిందే. అయితే.. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఇంటి వద్ద రెక్కీ పై కేంద్ర మంత్రి కిషన్‌ రెడ్డి సంచలన ఆరోపణలు చేశారు. పవన్‌ కళ్యాణ్‌ ఇంటి వద్ద రెక్కి చేయడం సరికాదని పేర్కొన్నారు.

దీనిపై రెండు తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలని.. దీనిపై విచారణ చేయాలని కోరారు కేంద్ర మంత్రి కిషన్‌ రెడ్డి. తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు తీసుకోకుంటే.. కేంద్రమే రంగంలోకి దిగుతుందని స్పష్టం చేశారు. వచ్చే ఎన్నికల్లో జనసేన పార్టీతో కలిసి..ముందుకు వెళుతున్నామని స్పష్టం చేశారు కేంద్ర మంత్రి కిషన్‌ రెడ్డి.

 

Read more RELATED
Recommended to you

Exit mobile version