ఆర్టీసీ బస్సు ఎక్కుదాం.. కిషన్ రెడ్డి పై జగ్గారెడ్డి ఫైర్..!

-

కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పై పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి ఫైర్ అయ్యారు. నువ్వు నేను ఇద్దరం కలిసి ఆర్టీసీ బస్సు ఎక్కుదాం పద అని చురకలు అంటించారు కిషన్ రెడ్డి కాంగ్రెస్ ని విమర్శించే ముందు బిజెపి హామీల గురించి ఆలోచించుకోమని అన్నారు ఏది మాట్లాడాలో ఏది మాట్లాడకూడదు అని ఇంకితజ్ఞానం లేదని అన్నారు కాంగ్రెస్ అధికారం లోకి వచ్చే రెండు నెలలు అయింది 20 కోట్ల మహిళలు ఉచిత బస్సు ప్రయాణం చేశారని గుర్తు చేశారు.

ఉచిత బస్సు ప్రయాణం నిజం కాదా నీ కండ్లకి కనిపించట్లేదా అని మండిపడ్డారు. ఇంకితజ్ఞానం లేకుండా మాట్లాడుతున్నారని చెప్పారు మహిళలకి ఉచిత బస్సు ప్రయాణం నీ కళ్ళకి కనిపించట్లేదా అని అడిగారు. నీ భార్యని ఆర్టీసీ బస్సు ఎక్కించు అట్లయినా తెలుస్తుంది అని అన్నారు. రాష్ట్రంలో ఏమైతుంది అనేది తెలుసుకోలేని నువ్వు ఏం రాష్ట్ర అధ్యక్షుడువి అని అన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news