ఆలయాలకు యార్లగడ్డ రూ.3లక్షల విరాళం

-

కృష్ణా జిల్లా గన్నవరం మండలం బుద్ధవరం గ్రామంలోని రెండు ఆలయాలకు గన్నవరం నియోజకవర్గం టీడీపీ ఇన్ చార్జీ యార్లగడ్డ వెంకట్రావు మూడు లక్షల రూపాయల నగదు విరాళంగా అందజేశారు. గ్రామంలో బుధవారం ఉదయం శ్రీ అభయాంజనేయస్వామి వారి విగ్రహ ప్రతిష్ట కార్యక్రమంలో పాల్గొన్న ఆయన స్వామి వారిన దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ ఆలయ అభివృద్ధికి రెండు లక్షల రూపాయలను ఆలయ కమిటీ సభ్యులకు అందించారు. 

ఆ తరువాత ఇటీవలే విగ్రహ, ధ్వజస్థంభ ప్రతిష్ట జరిగిన శ్రీసీతారామాలయానికి వెళ్లిన గన్నవరం నియోజకవర్గం టీడీపీ ఇన్ చార్జీ యార్లగడ్డ వెంకట్ రావు శ్రీసీతారామ స్వామిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ అభివృద్ధి పనుల కోసం లక్ష రూపాయలను ఆలయ కమిటీ సభ్యులకు అందించారు. రెండు చోట్ల ఆలయ నిర్వహణ కమిటీ సభ్యులు యార్లగడ్డకు స్వామి వారి శేష వస్త్రం కప్పి ఘన స్వాగతం పలికారు. 

Read more RELATED
Recommended to you

Latest news