కిషన్ రెడ్డి, రేవంత్ రెడ్డి ఇద్దరు అన్నదమ్ములు : బాల్క సుమన్

-

కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నిలదీస్తూ మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ తెలంగాణ భవన్‌లో ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా బాల్క సుమన్ మాట్లాడుతూ..కాంగ్రెస్ పార్టీలో ఎంపీ అభ్యర్థులు డమ్మీ అభ్యర్థులే అని ధ్వజమెత్తారు. కిషన్ రెడ్డి, రేవంత్ రెడ్డి ఇద్దరు అన్నదమ్ములు.. కిషన్ రెడ్డి గెలుపు కోసం దానం నాగేందర్‌ను మా పార్టీ నుండి తీసుకోని ప్రకటించాడు అని ఆగ్రహం వ్యక్తం చేశారు. మోడీ బడే భాయ్.. రేవంత్ రెడ్డి ఛోటే భాయ్ అని తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు.

 

మోడీ చెప్పినట్లుగా తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ నుంచి డమ్మీ అభ్యర్థులను ప్రకటించారు అని ఆరోపించారు . కొడంగల్ పోయి ముసలి కన్నీరు కారుస్తున్నడు రేవంత్ రెడ్డి అని అన్నారు. మొన్నటి వరకు బీజేపీ, బీఆర్ఎస్ ఒక్కటే అని అన్నారు.. ఇవ్వాళ కాంగ్రెస్ పార్టీ బీజేపీ ఒక్కటే అని బాల్క సుమన్ తెలిపారు. రెండు పార్టీల కంటే బీఆర్ఎస్ పార్టీనే బలమైన పార్టి అందుకే మా పార్టీ నాయకులను, కాంగ్రెస్, బీజేపీ పార్టీలు తీసుకుని అభ్యర్థులగా పెట్టుకున్నారు అని మండిపడ్డారు.

Read more RELATED
Recommended to you

Latest news