తెలంగాణలో బిజెపి ప్రభుత్వం త్వరలోనే రాబోతుంది : ఎంఎల్ఏ మహేశ్వర్ రెడ్డి

-

బిజెపి ఎంఎల్ఏ మహేశ్వర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ లో త్వరలోనే రామరాజ్యం ఖాయం అని ఆశా భావం వ్యక్తం చేశారు.త్వరలోనే బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు చేస్తాం అని ఆయన ధీమా వ్యక్తం చేశారు. బుధవారం మీడియాతో చిట్ చాట్‌లో ఆయన మాట్లాడారు.కాంగ్రెస్ నేతలు వారి ప్రభుత్వంను వారే కూల్చుకుంటారు .ఇప్పటికే ఎవరి దుకాణం వారు పెట్టుకున్నారు అని అన్నారు.

నన్ను వెన్ను పోటు పొడుస్తున్నారు అని రేవంత్ రెడ్డే చెబుతున్నారు.అంటే పార్టీ లో జరుగుతున్న విషయాలు ఆయనే బయటపెట్టాడు అని ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి అన్నారు.ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇన్ సెక్యూర్ గా ఉన్నాయనడానికి ఇదే నిదర్శనం అని తెలిపారు. రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా ఉత్తం కుమార్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాసరెడ్డి వంటి నేతలు మా వెంట ఇంత మంది ఎమ్మెల్యేలు ఉన్నారని అంటున్నారు అని అన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news