కాంగ్రెస్ మునిగిపోతున్న నావ: కిషన్ రెడ్డి

-

కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీల మీద కేంద్ర మంత్రి తెలంగాణ బిజెపి చీఫ్ కిషన్ రెడ్డి మండిపడ్డారు మీడియాతో ఆయన మాట్లాడుతూ తెలంగాణలో దొంగలు పోయి గజదొంగలు వచ్చారని అన్నారు. కాంగ్రెస్ పాలన అని ఇలా ఉందని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ బీఆర్ఎస్ రెండు పార్టీల డిఎన్ఏ ఒక్కటేనని అన్నారు. కాంగ్రెస్ కి ఓటేసినందుకు ప్రజల నుండి రాహుల్ ట్యాక్స్ వసూలు చేస్తున్నారని అన్నారు.

వ్యాపారవేత్తలు రాహుల్ కి వందల కోట్లు ఇవ్వాల్సింది అని ఆరోపించారు వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీకి 40 ఎంపీ సీట్లు కూడా రావని చెప్పారు కిషన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ దేశవ్యాప్తంగా మునిగిపోతున్న నావా అని అన్నారు. తెలంగాణలో బిజెపి మెజారిటీ సీట్లు గెలవబోతుందని ఆయన చెప్పారు కేంద్రంలో బిజెపి ప్రభుత్వం ఇంకోసారి ఏర్పడుతుందని మోడీ మూడోసారి ప్రధాని అవుతారని అన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news