నేనెప్పుడూ ప్రజల కోసమే పనిచేశా.. మరో ఛాన్స్ ఇవ్వండి : కిషన్ రెడ్డి

-

తాను ఏనాడు దౌర్జన్యం చేయలేదని, ఎలాంటి అక్రమాలకు పాల్పడలేదని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, సికింద్రాబాద్ ఎంపీ అభ్యర్థి, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. ఎల్లప్పుడు ప్రజల కోసమే పని చేశానని చెప్పారు. అందుకే తనకు ఈ ఎన్నికల్లో మరోసారి అవకాశం ఇవ్వాలని, ఓట్ల రూపంలో తనపై ప్రేమను కురిపించాలని ప్రజలను కోరారు. ఇవాళ సికింద్రాబాద్ బీజేపీ ఎంపీ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేయనున్న నేపథ్యంలో హైదరాబాద్ మెహబూబ్ కాలేజీ మైదానంలో సభను ఏర్పాటు చేశారు.

ఈ సభకు కేంద్ర మంత్రి రాజ్ నాథ్, రాజ్యసభ సభ్యుడు లక్ష్మణ్ హాజరయ్యారు. వీరిద్దరు కిషన్ రెడ్డి నామినేషన్ కార్యక్రమంలోనూ పాల్గొననున్నారు. 2019లో సికింద్రాబాద్ ఎంపీగా విజయం సాధించిన తాను కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి, కేంద్ర పర్యాటక శాఖ మంత్రిగా అనేక కార్యక్రమాలు నిర్వహించానని తెలిపారు.  కేంద్రమంత్రితో పాటు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా సమాంతరంగా పని చేశానన్న కిషన్ రెడ్డి.. ఈ  నాలుగున్నర ఏళ్లల్లో సికింద్రాబాద్‌కు చేసిన ప్రగతి నివేదికను ప్రజల ముందుపెట్టానని పేర్కొన్నారు. తాను ప్రజలకు సేవ చేశాను కాబట్టే నివేదికను ప్రజల ముందుకు పెట్టగలిగానని, తనకు పూర్తిగా ఓటు అభ్యర్థి హక్కు ఉందని చెప్పారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version