కేంద్రమంత్రిగా కిషన్ రెడ్డి ప్రమాణ స్వీకారం

-

సికింద్రాబాద్ బీజేపీ ఎంపీ జి.కిషన్ రెడ్డి కేంద్రమంత్రిగా ప్రమాణస్వీకారం చేశారు. ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్ ప్రాంగణంలో జరిగిన కార్యక్రమంలో ఆయనతో ప్రెసిడెంట్ ద్రౌపదీ ముర్ము ప్రమాణం చేయించారు. కిషన్ రెడ్డిని మంత్రి పదవి వరించడం వరుసగా ఇది రెండోసారి. మోదీ 3.0 కేబినెట్లో 72 మందికి చోటు కల్పించారు.ఈ కార్యక్రమానికి 7 దేశాల అధినేతలు, భారత సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ చంద్రచూడ్, చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, పలువురు సీఎంలు, ఖర్గే, ముకేశ్ అంబానీ, అదానీ, సూపర్ స్టార్ రజినీకాంత్, షారుఖ్ ఖాన్, అక్షయ్ కుమార్ సహా 8 వేల మంది ప్రముఖులు హాజరయ్యారు.

కాగా, తెలంగాణలో బీజేపీకి సింగిల్‌గా 8 ఎంపీ సీట్లు గెలుచుకోవడంలో కిషన్ రెడ్డి కీలక పాత్ర పోషించారు. అయితే.. ఇలా సింగిల్‌గా 8 సీట్లు గెలుచుకోవటం బీజేపీ చరిత్రలో ఇదే తొలిసారి.

Read more RELATED
Recommended to you

Latest news